Telugu News: పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా అరెస్టు

ఆదిలాబాద్‌ జిల్లాలో కొంత మంది వేటగాళ్లు పులిని వేటాడి చంపేశారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం వాల్గొండ పరిధిలోని హీరాపూర్‌ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు పులిని వేటాడి....

Updated : 31 Oct 2021 16:15 IST

ఇంద్రవెల్లి‌: ఆదిలాబాద్‌ జిల్లాలో కొంత మంది వేటగాళ్లు పులిని వేటాడి చంపేశారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం వాల్గొండ పరిధిలోని హీరాపూర్‌ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు పులిని వేటాడి చంపేశారు. అనంతరం పులి చర్మాన్ని జిల్లాలోని కాగజ్‌నగర్‌ తరలిస్తుండగా పోలీసులు వేటగాళ్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పులిని చంపిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో వాల్గొండ వీరాపూర్‌, వడగాం గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది సోదాలు చేపట్టారు. అయితే తాము ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసంలో బూట్లు ధరించి ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు చేశారని ఆరోపిస్తూ ఇంద్రవెల్లి మండల కేంద్రం వద్ద అటవీశాఖ వాహనాన్ని పలువురు ఆదివాసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు జీపులో కూర్చున్న సిబ్బందిని బయటకు లాగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని