Crime news: జూబ్లీహిల్స్‌లో దారుణం: మహిళల బాత్‌రూమ్‌లో కెమెరా

జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది.

Updated : 23 Sep 2021 12:27 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది. బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను ఓ యువతి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం  వెలుగు చేసింది. రంగంలోకి దిగిన  పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిన్నంతా ఫోన్‌ కెమెరా ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌ క్లీనర్‌గా పని చేసే బాలుడు ఫోన్‌ కెమెరా అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని