Mancherial: ఇటుక ట్రాక్టర్‌ బోల్తా.. తనిఖీల్లో 5 క్వింటాళ్ల గంజాయి

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సమీపంలో 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 24 Sep 2023 15:09 IST

నస్‌పూర్‌: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సమీపంలో 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరాంపూర్‌ జాతీయ రహదారిపై ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో.. పోలీసులు ట్రాక్టర్‌ను తనిఖీ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ఉన్నట్లు నిర్ధరించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గంజాయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని