దేవరకద్రలో గుట్టపై మృతదేహాల కలకలం! 

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర సమీపంలో గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. వీటిని గుర్తించిన....

Published : 27 May 2021 00:20 IST

దేవరకద్ర: మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర సమీపంలో గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. వీటిని గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక యువకుడు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. మృతులు ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముగ్గురూ దేవరకద్రకు చెందిన తల్లి, కుమారుడు, కుమార్తెగా గుర్తించారు. గుడికి వెళ్తున్నామని చెప్పి సోమవారం తల్లీపిల్లలు బయటకు వెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని