విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం శివారు ప్రాంతమైన భోజ్య తండాలో విషాదం చోటు చేసుకుంది.

Updated : 10 Jul 2021 12:15 IST

తొర్రూరు: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం శివారు ప్రాంతమైన భోజ్య తండాలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. వ్యవసాయ మోటారు స్టార్టర్‌కు ఫీజులు వేసే క్రమంలో బోరుకు తగులుకొని ఉన్న జే తీగకు విద్యుత్‌ సరఫరా అయింది. దీంతో తండాకు చెందిన భుక్యా సుధాకర్(28)‌, మాలోత్‌ యాకూబ్‌(40) అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని