Mancherial: పండగపూట విషాదం.. ఇద్దరు విద్యార్థినులు మృతి

మంచిర్యాల జిల్లా జన్నారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Updated : 24 Oct 2023 13:51 IST

జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం  పున్‌కల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీకి చెందిన కుంపర్ల రాహిత్య(15), వరాల సాత్విక(19) సోమవారం రాత్రి అక్కడ స్థానికంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రాహిత్య తండ్రి గంగన్నతో కలిసి ద్విచక్రవాహనంపై వారిరువురూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో పాతపున్‌కల్‌ వద్ద గుర్తు తెలియని వాహనం.. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.  

గంగన్న స్వలంగా గాయపడగా..  విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం రాహిత్య, సాత్విక మృతి చెందారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  రాహిత్య పదో తరగతి చదువుతుండగా.. సాత్విక  నీట్‌ శిక్షణ తీసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని