బంజారాహిల్స్‌లో యువతి ఆత్మహత్య

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఓ యువతి తనువు చాలించింది. సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు

Published : 31 Mar 2021 01:17 IST

జూబ్లీహిల్స్‌: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఓ యువతి తనువు చాలించింది. సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఐశ్వర్య (19) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటోంది. ఈ క్రమంలో మరెడ్డి అషేర్ (20) అనే యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమ వివాహం వరకు వెళ్లింది.

గతంలో తమ పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న పెద్దలు.. వీరిని విడదీశారు. అయినప్పటికీ ఆ యువ జంట అప్పుడప్పుడూ కలుస్తుండేది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను ప్రియుడు అషేర్‌ నమ్మిస్తూ వచ్చాడు. ఇలా కాలం వెళ్లదీస్తుండటంతో అషేర్‌ను ఐశ్వర్య నిలదీసింది. దీంతో అతడు ముఖం చాటేయడంతో సదరు యువతి తాను ఉంటున్న ఓ ప్రైవేటు వసతి గృహంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఐశ్వర్య కొన్ని సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని