మావలపై మౌనమేలా..?
స్థలాలు ఖాళీగా ఉన్నాయని గూడులేని నిరుపేదలు అక్కడ తాత్కాలిక పాకలు వేసుకుంటారు. ఆర్థిక స్తోమత లేకున్నా మెల్లిగా అక్కడ రేకులషెడ్లు, సిమెంటు ఇటుకలతో నిర్మాణాలు చేపడతారు. ఇక తమకు గూడు దొరికిందని సంబరపడుతున్న ఆ పేదల సంతోషం అంతలోనే ఆవిరైపోతోంది. అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు.
సర్వే నెంబరు 170లోని అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోని వైనం
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
స్థలాలు ఖాళీగా ఉన్నాయని గూడులేని నిరుపేదలు అక్కడ తాత్కాలిక పాకలు వేసుకుంటారు. ఆర్థిక స్తోమత లేకున్నా మెల్లిగా అక్కడ రేకులషెడ్లు, సిమెంటు ఇటుకలతో నిర్మాణాలు చేపడతారు. ఇక తమకు గూడు దొరికిందని సంబరపడుతున్న ఆ పేదల సంతోషం అంతలోనే ఆవిరైపోతోంది. అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం మావల శివారులోని సర్వే నం.170లో తరచూ జరుగుతున్న ఘటనలు ఇవి. ఈ సర్వే నెంబరు పరిధిలో మొత్తం 184.02 ఎకరాల భూమి ఉంది. పదేళ్లకిందట అందులో 35 ఎకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. ఈ సర్వే నెంబరులోని భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) రాని భూములే ఉన్నాయి. కొందరు చాకచక్యంగా ఇతర పట్టా చూపిస్తూ.. ఇక్కడ భూముల్లో పాగావేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. దర్జాగా ఈ దందా సాగిస్తున్నారు. ఇదే సర్వే నెంబరులోని పేదలు పాకలు వేసుకుంటే కూల్చివేస్తున్న అధికారులు పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈ ప్లాట్లను కొనుగోలు చేసే ప్రజలు నష్టపోతున్నా అధికారులు బాధ్యులపై చర్యలకు వెనుకంజ వేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
మావల శివారులోని సర్వే నం.170లో అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ, పురపాలక సిబ్బంది పేదల పాకలను కూల్చివేశారు. తరచూ ఇక్కడ పాకలు కూల్చివేయడం పరిపాటి.
మావల శివారు సర్వే నెం.170/54లోని చిత్రమిది. సౌత్ పార్కు వెనుకాల ఉన్న 2.02 ఎకరాల స్థలం రెవెన్యూ ఆధీనంలో ఉండగా.. గతంలో ఈ భూమిని అసైన్డ్ చేసిన వ్యక్తి కోర్టుకెళ్లారు. కొందరు పక్కనే ఉన్న ఇతర ప్రైవేటు పట్టాపేరుతో ఇక్కడ పాగావేసి ప్లాట్లుచేసి విక్రయించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆటంకాలు ఉండటంతో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ విషయం తెలియక కొందరు కొనుగోలు చేశారు. ఈ అక్రమంపై ‘ఈనాడు’లో కథనం రావడంతో అధికారులు కొన్ని బండలు తొలగించారు. మరికొన్ని బండలు అలాగే ఉంచారు. రిజిస్ట్రేషన్లు మాత్రం రద్దుకాలేదు. బాధ్యులపై చర్యలు లేవు.
‘ఈనాడు’లో సర్వే నెం.170/54పై వచ్చిన కథనం
మావల శివారు సర్వే నెం.170/33లోని 5.60 ఎకరాల భూమి అమ్మడానికి వీల్లేకున్నా నకిలీ ఎన్ఓసీతో ప్లాట్లు చేసి విక్రయించారు. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులు సహకరించారు. రిజిస్ట్రేషన్లు జరిగాయి. ‘ఈనాడు’ కథనంతో హద్దు రాళ్లు తొలగించారు. వాస్తవానికి సాగుకోసం ఇచ్చిన భూమిని ప్లాట్లు చేసినందుకు ‘పీఓటీ’ యాక్టు మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ఉన్నా రెవెన్యూ అధికారులు మౌనంగా ఉంటున్నారు.
‘ఈనాడు’లో 170/33పై వచ్చిన కథనం
సర్వే నం.170లోని రెండు పడక గదుల ఇళ్లకోసం నిర్మించిన అపార్ట్మెంట్ వెనుకాల దృశ్యమిది. ఇక్కడ ప్లాట్ల కోసం పాతిన బండలు పెరిగిన గడ్డిలో కలిసిపోయాయి. ఈ ఎకరం భూమిని అమ్మడానికి వీల్లేకున్నా కొందరు ఇతర పట్టా చూపిస్తూ ప్లాట్లు చేసి విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434