తేలిన బరి.. గెలుపుపై గురి
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది.
మూడు పార్టీల అభ్యర్థులకు పరీక్ష
ఈటీవీ-ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. అభ్యర్థుల బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలపై అధిష్ఠానాలు దృష్టిసారించాయి. సొంత పార్టీల్లోని ముఖ్య నేతల ద్వంద్వ వైఖరి, అంకితభావంతో పని చేసే కింది స్థాయి కార్యకర్తల పనితీరుకు ఇది గిటురాయిగా నిలుస్తోంది. అందరిని సమన్వయం చేసుకుని విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, విమర్శలకు తావీయకుండా నడుచుకోవాలని మూడు పార్టీల అగ్రనేతలు సూచించడంతో బరిలో నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులకు పరీక్షగా మారింది.
కాంగ్రెస్కు కొత్త అభ్యర్థిత్వం..
ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ పార్లమెంటరీ ఎన్నికల పోరులో నిలవడం ఇదే ప్రథమం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అండదండలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) సానుకూలతతో అభ్యర్థిగా రాణించగలిగినప్పటికీ టికెట్ చేజారిన మిగిలిన ఆశావహ అసంతృప్తులను దారికి తెచ్చుకోవటం పరీక్షే. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 22 మంది అభ్యర్థుల్లో ముగ్గురు నలుగురు అభ్యర్థులు తమ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే రాజకీయ పరిణితి ఉన్నవారు. వారందర్నీ ఏకతాటిపై నడిపించటంలో సుగుణ ఏ మేరకు సఫలీకృతమవుతారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. మహిళ కావటం, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఇటీవల భారాసకు చెందిన కీలకనేతలు కాంగ్రెస్లో చేరటం, అందర్నీ సమన్వయం చేసే బాధ్యతను సీతక్క తీసుకోవటం సుగుణకు కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భాజపా బలం కొనసాగేనా?
భాజపా టికెట్ గోడం నగేష్ని వరించటమే ఓ అనూహ్య మలుపు. ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ సంస్థాగత ఆచరణలతో నడిచే భాజపా సిద్ధాంతాలకు కొత్త కావటం కొంత ఇబ్బందికరమైన అంశమే. ప్రధానమంత్రి మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అండదండలు ఉండటం కలిసివచ్చే అంశాలు. కానీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. పార్టీలోని క్రియాశీలకమైన నాయకుల సమన్వయంతో కాకుండా ఒకరిద్దరు అనుకూలమైన అనుచరులతోనే నగేష్ అంతర్గత ప్రచారం చేస్తున్నారని విమర్శ వస్తోంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పార్టీకి దూరంగా ఉండటం, టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ అంటీముట్టనట్లు వ్యవహరించటం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. అధిష్ఠానం సూచనతో సోయం బాపురావు, రమేష్ రాఠోడ్తో సమన్వయం చేసుకునేందుకు నగేష్ ప్రయత్నిస్తున్నప్పటికీ స్థానిక నేతలు అడ్డుతగులుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
భారాసకు భరోసా లభించేనా?
భారాస టికెట్ను ఏకపక్షంగా దక్కించుకోవటంలో విజయం సాధించిన ఆత్రం సక్కు పార్టీలో నెలకొన్న అనిశ్చితిని ఛేదించాల్సి ఉంది. ఆదిలాబాద్లో జోగు రామన్న, ఆసిఫాబాద్లో కోవ లక్ష్మీ, బోథ్లో అనిల్ జాదవ్ బలంగానే ఉన్నప్పటికీ మిగిలిన నిర్మల్, ముథోల్, సిర్పూర్(టి), ఖానాపూర్ నియోజకవర్గాల్లో శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగే నేతల కోసం అన్వేషించాల్సి వస్తోంది. స్వతహాగా జనాన్ని ప్రభావితం చేయగలిగే రాజకీయ అనుభవం ఉండటం, బయట పడకుండా వ్యూహాలతో అనుకున్నది నెరవేర్చుకునే లక్షణం కలిగి ఉండటం ఆత్రం సక్కుకు కలిసివచ్చే అంశమే. భాజపా, కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న ఆయన ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తూ, గిరిజనులతోపాటు, గిరిజనేతరుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సొంత పార్టీలోని అసమ్మతికి దీటుగా కాంగ్రెస్, భాజపాలోని అసంతృప్తిని, అసమ్మతీయులను అనుకూలంగా మార్చుకునే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
[ 27-04-2024]
మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీం బాధ్యురాలు బి.సుశీల సూచించారు. -
అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
[ 27-04-2024]
స్థానిక సుదరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సబిత ముఖ్యఅధితిగా హజరై, పిల్లలకు అభివృద్ధి పత్రాలు అందించారు. -
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి