ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది.
జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్లకుపైగా బకాయిలు
న్యూస్టుడే, తాంసి
పనులకు వెళ్తున్న ఉపాధి హామీ కూలీలు
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 1.72 లక్షల జాబ్కార్డులుండగా 3.46 లక్షల వరకు కూలీలున్నారు. వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం 1.26 లక్షల మంది కూలీలు మాత్రమే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. వీరికి ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కూలీ డబ్బులు అందడం లేదు. సుమారు రూ.10 కోట్లకుపైగా దినసరి వేతనాల బకాయిలు ఉన్నట్లు సమాచారం. త్వరగా అవసరానికి డబ్బులు వస్తాయని ఉపాధి పనికి వెళ్తే నెలల తరబడి డబ్బులకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండకు విలవిల..
డబ్బులు రాక అవస్థలు పడుతున్న వీరికి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎండకు తాళలేకపోతున్నారు. ఎవరైనా సొమ్మసిల్లినా, వడదెబ్బ తగిలినా అందుబాటులో ప్రథమ చికిత్స కిట్లు లేవు. పని ప్రదేశంలో తాగునీరు ఇవ్వడం లేదు. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక విశ్రాంతికి పది నిమిషాలు కూర్చుందామంటే ఎక్కడా టెంట్లు కానరావడం లేదని కూలీలు చెబుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు గతంలో వేసవి భత్యం ఇచ్చేవారు. ఇప్పుడు దానికి కూడా స్వస్తి చెప్పారు. తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని పంచాయతీలకు ఇటీవల బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినా.. చాలా చోట్ల వసతులు కల్పించడం లేదు.
పొన్నారి చెరువు పూడికతీత పనుల్లో కూలీలు
సకాలంలో రాక ఆర్థిక ఇబ్బందులు
రెండు నెలలుగా ఉపాధి హామీ ప్రదేశాల్లో వసతులు లేకున్నా పనులు చేస్తున్నాం. ఇంతవరకు డబ్బులు రాలేదు. అధికారులు, బ్యాంకు, తపాలా కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సకాలంలో కూలి డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇతర వ్యవసాయ పనులతోపాటు సీసీ రోడ్ల నిర్మాణానికి వెళ్తే రోజుకు రూ.500 నుంచి రూ.600 వచ్చేది. జైనథ్ మండలం భోరజ్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఆశన్న, శ్రీనివాస్, శ్రీకాంత్, విలాస్, ఎర్రన్న చెబుతున్న మాటలివి.
డబ్బులు రాక అప్పులు చేస్తున్నాం..
ఫిబ్రవరి, మార్చి నెలల్లో 6 వారాలు ఉపాధి హామీ పనికి వెళ్లాం. కానీ ఆ డబ్బులు ఇంతవరకు అందలేదు. నిత్యావసరాల కొనుగోలుకు, డ్వాక్రా రుణం కట్టడానికి ఇబ్బందిగా ఉంది. అప్పుచేసి తిండి గింజలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి తీయడం, కూరగాయలు తెంపడానికి వెళ్లినా రోజుకు రూ.300 వచ్చేది. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఎస్కె జాముర, లక్ష్మి, నీలమణిల ఆవేదన ఇది...
త్వరలో చెల్లిస్తాం
జి.సాయన్న, డీఆర్డీవో, ఆదిలాబాద్
కూలీ డబ్బుల చెల్లింపులో ఆలస్యం జరగడం వాస్తవమే. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు కూలీల ఖాతాల్లో జమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిదుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!