మందులిచ్చేవారేరి?
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది.
ఫార్మసిస్టు లేని వైద్యకళాశాల, అనుబంధ ఆసుపత్రి
జీజీహెచ్లో బాధితులకు మందులు అందించే ఫార్మసీ గది
మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్టుడే: ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మందులు ఎవరు అందించినా పర్వాలేదు.. ఫార్మసిస్టులు ఎందుకు అనే వైఖరి కనిపిస్తోంది. రెండు జిల్లాలకు పెద్దదిక్కుతో పాటు పెద్దాసుపత్రిగా పేరుపొందిన మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనే ఫార్మసిస్టులు లేరు. డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి వెళ్లి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఒక్క ఫార్మసిస్టు నియామకం కూడా చేపట్టకుండా నెట్టుకొస్తున్నారు. స్టాఫ్నర్సులే ఔషధాలు అందజేస్తున్నారు. తాత్కాలిక, పొరుగుసేవల ద్వారా అయినా నియమించేందుకు అవకాశమున్నా పర్యవేక్షకులు చొరవ చూపడం లేదు.
అవసరమైన విభాగాలపైనే నిర్లక్ష్యం..
ఆసుపత్రికి అత్యవసరమైన విభాగాల్లో ఫార్మసి ముఖ్యమైనది. ఇప్పటికే ప్రధానమైన రేడియోగ్రాఫర్, ల్యాబ్టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు కీలకమైన ఫార్మసిని పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైద్యకళాశాల పరిధిలో 12 పోస్టులు ఉండగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. శాశ్వత నియామకం పక్కనపెడితే కనీసం తాత్కాలికంగానైనా ఆయా ఖాళీలు చేపడితే ఉపశమనం కలుగుతుంది. కానీ ఆ ఆలోచనే చేయడం లేదు కళాశాల, ఆసుపత్రి నిర్వాహకులు. జీజీహెచ్, ఎంసీహెచ్లలో నాలుగైదు చోట్ల ఫార్మసి కేంద్రాలు ఉన్నాయి. ప్రతిచోటా స్టాఫ్నర్సులతోనే బాధితులకు మందులు అందిస్తున్నారు. ఏదైనా సమస్య ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. జీజీహెచ్ పర్యవేక్షకులు అనేకసార్లు విన్నవించుకున్నా వైద్యకళాశాల నిర్వాహకులు పట్టించుకోవడం లేదని తెలిసింది.
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లోని డ్రగ్ స్టోర్లో మిగతా స్టాఫ్నర్సులకు సూచనలు ఇస్తూ సేవలు అందిస్తున్న ఈమె పేరు హేమలత. తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) ఫార్మసిస్టు. అయినా సంబంధిత ఆసుపత్రుల్లో కాకుండా ఇక్కడ భారంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జీజీహెచ్, ఎంసీహెచ్ రెండింటికీ పెద్దదిక్కు ఈమె ఒక్కరే. కనీసం తనతో విధులు పంచుకునేందుకు సంబంధిత విభాగానికి చెందిన వారు లేరు. మందుల సరఫరా పరిశీలనతో పాటు ఆసుపత్రుల్లోని ఇన్ పెషేంట్(ఐపీ), ఔట్ పెషెంట్(ఓపీ), ఐసీయూ తదితర వార్డులకు పంపిణీ చేయడం వరకు ఈమె చూసుకుంటున్నారు. పనిభారం తీవ్రమై ఇక్కడ నియామకాలైనా చేపట్టండి.. లేదా తన శాఖకు బదిలీ అయిన చేయండి అంటూ మొరపెట్టుకున్నారు.
ఈమె పేరు గాయత్రి.. 15 ఏళ్లుగా పొరుగు సేవల ద్వారా(టీవీవీపీ పరిధిలో) ఫార్మసిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో మొదలైన తన సేవలు, జిల్లా, ప్రస్తుతం జీజీహెచ్ వరకు కొనసాగుతున్నాయి. గత నెలతో ఆమె కొలువు గడువు ముగిసింది. ఆసుపత్రిలో ఫార్మసిస్టు కొరత ఉండటంతో పొడిగిస్తామంటూ చెప్పి ఆమె సేవలు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ సంబంధిత ఏజెన్సీ ఆమె చేస్తున్న ఫార్మసిస్టు కొలువును కలిపి నూతన నియామకాలకు ఉద్యోగ ప్రకటన ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి
[ 01-05-2024]
కార్మికులకు తగిన గౌరవం ఇస్తూ వారికి పనికి తగ్గ వేతనం చెల్లించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి అయిన సీనియర్ సివిల్ జడ్జి ప్రమీల జైన్ అన్నారు. -
బాల్యవివాహాల దుష్పరిణామాలపై అవగాహన
[ 01-05-2024]
బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై స్థానిక సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో బుధవారం కిషోర బాలికలకు అవగాహన సదస్సును నిర్వహించారు. -
వికసించిన మే పుష్పం
[ 01-05-2024]
ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసిస్తుంది మే పుష్పం. జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ కాలనీలో నివసిస్తున్న ఉల్లాస్ ఇంట్లో బుధవారం మే పుష్పం వికసించింది. -
ఉత్సాహంగా కరాటే గ్రేడింగ్ పరీక్ష
[ 01-05-2024]
జిల్లా కేంద్రంలోని అరుణోదయ పాఠశాలలో బుధవారం పట్టణ స్థాయి కరాటే గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. -
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే
[ 01-05-2024]
జిల్లా కేంద్రంలో బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే ను ఘనంగా నిర్వహించారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
[ 01-05-2024]
జిల్లా వ్యాప్తంగా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. -
సీపీఐ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం
[ 01-05-2024]
జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
[ 01-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
స్వేచ్ఛగా ఓటు వేయండి
[ 01-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో బుధవారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఘనంగా కార్మిక దినోత్సవం
[ 01-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం గోట్కూరి, తాంసిలో బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవంను ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
భాజపా విధానాలను వ్యతిరేకించాలి
[ 01-05-2024]
కార్మికుల హక్కులను కాలరాస్తున్న భాజపా సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. -
పరస్పర సహకారంతో కేసులు పరిష్కరిద్దాం
[ 01-05-2024]
న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పరం సహకరించుకొని అత్యధిక కేసులు పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు సూచించారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
[ 01-05-2024]
భాజపా తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్ల రద్దుకు పోరాటం ఉధృతం చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. -
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు
[ 01-05-2024]
బోథ్, సొనల గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
ఈవీఎం @ 35ఏళ్లు..
[ 01-05-2024]
దేశంలోని ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెలుసుకుదాం. -
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
[ 01-05-2024]
సర్కారీ స్థలాల కబ్జా, అక్రమ వెంచర్లతో చెలరేగుతున్న భూ మాఫియా వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
రెండు స్థానాలు ఎగబాకి..
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాలు ఈసారి కొంత ఊరటనిచ్చాయి. కిందటేడాదితో పోల్చితే జిల్లాకు 19వ స్థానం రాగా.. ఈసారి రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం దక్కించుకుంది. -
ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కె.ప్రభాకర్రావు
[ 01-05-2024]
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్గా కె.ప్రభాకర్రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన
[ 01-05-2024]
విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. -
ఎన్నికల సిబ్బందికి ముందే ఓటు
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సమస్యలు అనేకం.. పరిష్కరించే వారితో మమేకం
[ 01-05-2024]
కేంద్ర కార్మికశాఖ సేకరించిన వివరాల ప్రకారం దేశంలోని శ్రామికశక్తిలో దాదాపు 93 శాతం అసంఘటితరంగంలో ఉన్నారు. 2011 నాటి లెక్కల ప్రకారం 47.41 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు అంచనా. -
అడవిలో 3 కి.మీ. నడవాల్సిందే..
[ 01-05-2024]
వేమనపల్లి మండలంలోని బొమ్మెన, చామనపల్లి గ్రామానికి చెందిన ఓటర్లకు అడవిలో 3 కి.మీ. కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి. -
ప్రచారానికి వడదెబ్బ
[ 01-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంత ఉక్కపోత.. కాలు బయట పెడితే భగ్గుమంటోంది.. కానీ వెళ్లక తప్పదు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉండటంతో అభ్యర్థులతో పాటు నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లను రాబటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
‘పది’ ఫలితాల్లో దిగజారి!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో జిల్లా మరోసారి వెనుకబడిపోయింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా గతేడాది ఫలితాలతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 31వ స్థానంలో నిలిచింది. -
పదిలో కొంచెం పైకి..
[ 01-05-2024]
విద్యార్థుల భవితను నిర్ణయించే పదోతరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత గతంలో కన్నా మెరుగుపడింది. -
గెలుపే లక్ష్యం.. చేరికలకు ప్రాధాన్యం
[ 01-05-2024]
పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. కీలక నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. -
ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి
[ 01-05-2024]
జిల్లా రైతులు పండిస్తున్న సేంద్రియ ఉత్పత్తుల కోసం స్థానికంగా ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపాలో చేరడం అదృష్టంగా భావిస్తున్నా
[ 01-05-2024]
భారాసలోని కేంద్రీకృత విధానాల వల్ల ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన తనకు గడిచిన రెండు నెలల 25 రోజులు ప్రశాంతత లేకపోవడంతోపాటు అవహేళనకు గురయ్యానని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్నేత పేర్కొన్నారు. -
‘రూ.కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు’
[ 01-05-2024]
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డికి రూ.కోట్లు ఇచ్చి తన కొడుకు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. -
ఆడబిడ్డగా ఆదరించండి
[ 01-05-2024]
ఆడబిడ్డగా మీ చెంతకు వచ్చా..కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను ఆదరించండి అయిదేళ్లు అండగా ఉంటా అంటూ ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. -
ఆత్మీయ సమ్మేళనాలకే ప్రాధాన్యం
[ 01-05-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM