logo

తల్లిదండ్రుల కమిటీ తీర్మానంతోనే చెల్లింపులు

మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ కళాశాలల్లో చేపట్టిన పనులకు కళాశాలలో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం చేశాకే చెల్లింపులు చేపట్టాలని ఇంటర్మీడియట్‌ బోర్డు జిల్లా అధికారి బెన్నస్వామి సూచించారు.

Published : 03 Dec 2022 00:58 IST

కళాశాలలో పనులను పరిశీలిస్తున్న బెన్నస్వామి

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ కళాశాలల్లో చేపట్టిన పనులకు కళాశాలలో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం చేశాకే చెల్లింపులు చేపట్టాలని ఇంటర్మీడియట్‌ బోర్డు జిల్లా అధికారి బెన్నస్వామి సూచించారు. శుక్రవారం ఆయన ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలో చేపడుతున్న నాడు - నేడు పనులను పరిశీలించారు. నిబంధనలు అనుసరించి సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు బోధిస్తున్న తీరుపై ఆరా తీశారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు జరిగే అర్ధ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని