పాలకులు పట్టించుకోరు.. గిరిజనమే పట్టుపట్టారు!
దశాబ్దాలుగా రహదారుల నిర్మాణంపై అధికారులు హామీలు, రాతలు, కాగితాల వరకే పరిమితమవుతున్నాయి. కనీస మార్గం లేని గ్రామాల్లో గిరిజనులు అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది.
శ్రమదానంతో తాత్కాలిక దారుల ఏర్పాటు
జి.మాడుగుల, న్యూస్టుడే
శ్రమదానంతో రహదారి నిర్మించుకుంటున్న డేగలరాయి గ్రామస్థులు (పాత చిత్రం)
దశాబ్దాలుగా రహదారుల నిర్మాణంపై అధికారులు హామీలు, రాతలు, కాగితాల వరకే పరిమితమవుతున్నాయి. కనీస మార్గం లేని గ్రామాల్లో గిరిజనులు అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. గడుతూరు పంచాయతీ బొడ్డుమామిడిలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పాంగి సోలుతిమ, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు వంతాల దివుడు(50) మృతి చెందారు. వీరిని ఆసుపత్రులకు తరలించేందుకు కనీస రహదారి సదుపాయం లేకపోవడం ప్రాణాలమీదకు తెచ్చింది.
గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వ పథకాలు గ్రామాలకు అందాలన్నా రహదారులు ముఖ్యం. రోగులను, గర్భిణులను ఆసుపత్రులకు సకాలంలో చేర్చాలంటే రహదారులు ఎంతో కీలకం. పాడేరు ఏజెన్సీ 11 మండలాల్లో వందలాది గ్రామాలకు రహదారులు లేకపోవడంతో గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం పక్క గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రహదారి సదుపాయాలు కల్పించాలని నాటి నుంచి నేటి వరకు ఎందరు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలను కోరినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా గిరిజనులు రహదారి కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికి పరిష్కారంగా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన మిషన్ కనెక్టులో భాగంగా మంజూరు చేసిన రహదారుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్నిచోట్ల రోజువారీ తిప్పలు తప్పేందుకు గిరిజనులే ఏకమై శ్రమదానంతో రహదారులను నిర్మించుకొంటున్నారు.
* ఇటీవలే జి.మాడుగుల మండలంలోని పర్యటించిన ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రహదారుల నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 11 మండలాల్లోని అన్ని గ్రామాలకూ రహదారులు వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. పాడేరు ఏజెన్సీ పరిధిలోని 900 గ్రామాలకు రహదారులు లేవని, మిషన్ కనెక్టులో భాగంగా రహదారులు నిర్మిస్తామని వారు చెప్పారు.
రహదారిని బాగుచేసుకుంటున్న రాసపనుకు గ్రామస్థులు (పాత చిత్రం)
గ్రామస్థులు నిర్మించుకున్న రోడ్లివే..
రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులు ముందు వేడుకొని, విసుగుచెందిన గిరిజనులు కలిసికట్టుగా పలుగు, పారలు పట్టుకొని శ్రమదానంతో రహదారులుగా మలుచుకొంటున్నారు.
* జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ లక్కపాడుకు రహదారి సదుపాయం లేదు. ఇక్కడ రహదారి నిర్మిస్తే మరో మూడు గ్రామాలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఐటీడీఏ స్పందన కార్యక్రమంలో విన్నవించారు. స్పందన లేకపోవడంతో గతేడాది మే 22న లక్కపాడుతో పాటు మరో మూడు గ్రామాలు గిరిజనులు చేయిచేయి కలిపి రహదారిని బాగుచేసుకున్నారు.
* మిషన్ కనెక్టులో భాగంగా వంతాల పంచాయతీ రాసపనుకు 3 కిలోమీటర్లు రహదారిని మంజూరు చేసింది. ఈ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్థులే ఏకమై శ్రమదానంతో తాత్కలికంగా నిర్మించుకున్నారు.
* వంజరి పంచాయతీ సువ్వపాడు, గేదెలబంద గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించకపోతే రానున్న ఎన్నికల్లో పోలింగుకు దూరంగా ఉంటామని గిరిజనులు హెచ్చరించారు. గత ఏడాది తాత్కాలిక రహదారిని నిర్మించుకున్నారు.
* డుంబ్రిగుడ మండలం గుంటసీమ్మ పంచాయతీ తడ్డా గ్రామానికి శాశ్వత రహదారి కల దశాబ్దాలుగా నెరవేరలేదు. తాత్కాలిక మట్టిరోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో తడ్డా గిరిజనులు శ్రమదానంతో బండరాళ్లను తొలగించి తాత్కాలికంగా రహదారిని నిర్మించుకున్నారు.
* రోడ్డు సదుపాయం మెరుగుపరచాలని పాలకులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ నుంచి రాసపనుకు వరకు 4 కిలోమీటర్లు రహదారిని గ్రామస్థులే నిర్మించుకున్నారు. ఈ రహదారికి పాడేరు ఐటీడీఏ రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. పొక్లెయిన్తో కొంత మేర మట్టి పనులు చేసి వదిలేశారు.
* జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి గ్రామానికి సరైన మార్గం లేదు. గత ఏడాది అక్టోబర్ 30న గ్రామస్థులు మట్టి దారిని నిర్మించుకున్నారు.
అన్ని గ్రామాలకు రోడ్లేస్తాం: మిషన్ కనెక్టులో భాగంగా ఇప్పటికే రహదారులు లేని గ్రామాలను గుర్తించాం. మిషన్ కనెక్టు పథకంలో రహదారులు మంజూరు చేస్తున్నాం. ఇప్పటికే పలు గ్రామాలకు రహదారి పనులు జరుగుతున్నాయి. మిగతా గ్రామాలకు త్వరలోనే మంజూరు చేస్తాం. ముందుగా కనీస మార్గం లేని వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాం. క్రమంగా మిగతా వాటికీ సదుపాయాలు కల్పిస్తాం.
మాణిక్యం, మండల ఇంజినీరింగ్ అధికారి, జి.మాడుగుల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?