రామా.. శాశ్వత వనవాసమేనా!?
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం శ్రీరామగిరి కనుమరుగు కానుందా? శ్రీరామగిరిలో సీతారాములకు ఇదే చివరి కల్యాణమా? అంటే.. అవుననే జవాబు వస్తోంది.
వరరామచంద్రాపురం, న్యూస్టుడే
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం శ్రీరామగిరి కనుమరుగు కానుందా? శ్రీరామగిరిలో సీతారాములకు ఇదే చివరి కల్యాణమా? అంటే.. అవుననే జవాబు వస్తోంది. పోలవరం ముంపు గ్రామాల్లో మొదటిదశలో తరలించే జాబితాలో (కాంటూరు41.15) శ్రీరామగిరి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఏటా ముక్కోటి, కృష్ణాష్టమి, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం వెళ్లలేని భక్తులకు రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయంలోని సీతారామయ్య ఆ భాగ్యాన్ని ఇన్నేళ్లు కల్పించారు. రాములోరి కల్యాణం ఇక్కడ మళ్లీ వీక్షించలేమన్న నిజాన్ని స్థానిక భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీరామగిరి వాసుల పూజలు అందుకున్న రామయ్య వారికి వరద కష్టకాలంలో అండగా తన కొండపైన ఆశ్రయం కల్పిస్తూనే ఉన్నారు.
రాముడు నడయాడిన ప్రాంతం
వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు భద్రాద్రి, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, వరరామచంద్రాపురం మండలంలోని శ్రీరామగిరిలో తిరిగారనేది స్థల పురాణం. సీతాపహరణం తరవాత రామ లక్ష్మణులు ఈ ప్రాంతంలోని మాతంగ మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. జటాయువుకు అంతిమసంస్కారం చేసిన గుర్తులు ఇక్కడ బండరాళ్లపై ఇంకా ఉన్నాయి. మాతంగముని సలహామేరకు దక్షిణ ముఖంగా తపస్సు చేశారని, రావణ సంహారం తరవాత ఇక్కడ దక్షిణముఖంగానే రామ, లక్ష్మణులు వెలిశారు. ఈ ఆధారాలతోనే శ్రీరామగిరి దేవాలయం రెండో భద్రాద్రి ఆలయంగా పేరుగాంచింది. ప్రధానంగా శ్రీరామనవమి ఉత్సవాల్లో కల్యాణానికి కార్యక్రమానికి పక్క రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి వేలాది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ఇంతటి ప్రాధాన్య పుణ్యక్షేత్రం పోలవరం ముంపులో కనుమరుగు అవుతోంది. శ్రీరామగిరి గ్రామానికి చెందిన 264 కుటుంబాలకు తాడ్వాయి మండలంలో పునరావాసం ఏర్పాటు చేశారు. దేవాలయంపై ఇప్పటివరకు సరైన నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
పట్టువస్త్రాలతో అప్పటి పీవో చినబాబు, తహసీల్దారు ప్రసాద్ తదితరులు
నిర్వాసితుల తరలింపు విషయంపై జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. పునరావాస కాలనీల్లో అన్ని వసతులు సమకూర్చిన తర్వాత తరలిస్తామన్నారు.
25 ఏళ్లగా పల్లకి సేవ : దాదాపుగా 25 ఏళ్ల నుంచి స్వామి ఉత్సవాల్లో పల్లకి సేవలో ఉంటున్నాను. శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, పర్వదినాల్లో స్వాములోరి పల్లకిని మోస్తున్నాను. మరో రెండు నెలల్లో గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని అధికారులు చెబుతుంటే, అక్కడ ఎవరి పల్లకి మోయాలి, ఎలా రాములోరి సేవలు చేయాలి? రామయ్యను వదిలి ఉండగలమా?
దానేబోయిన రంగయ్య, శ్రీరామగిరి
మాకు జీవితాంతం వియోగమా? : రావణాసురుడు కేవలం సీతమ్మను ఏడాదిపాటు మాత్రమే రామయ్యకు దూరం చేస్తే, పోలవరం ముంపు మా శ్రీరామగిరి రామయ్యకు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేస్తోంది. దాదాపుగా 60 ఏళ్ల నుంచి సేవలో ఉన్నాం. మానాన్న, తరువాత నేను, ఇప్పుడు నా పిల్లలు స్వామివారి కైంకర్యంలో తరిస్తున్నాం. రామయ్య సేవలేని మమ్మల్ని మేము ఊహించుకోలేక పోతున్నాం.
పురుషోత్తమాచార్యులు, అర్చకులు
పునరావాసం వద్ద ఏర్పాటు చేయాలి : 30 ఏళ్ల నుంచి రాములోరి ఉత్సవాలు చూస్తున్నాను. ఆయన మా గ్రామస్థులో ఒకరిగా మారిపోయారు. నిద్రలేచి ఆలయంవైపు తిరిగి ఒక్క నమస్కారం పెట్టుకుంటే చాలు. మా పనులు అన్నీ సక్రమంగా సాగిపోతాయి. మాకు పునరావాసం కల్పిస్తున్నచోట శ్రీరామగిరి రాములోరి విగ్రహాలతో గుడి నిర్మించాలి. మా రాముడు మా వెంటే ఉన్నాడని మా గ్రామాల ప్రజలకు కొండత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటిలా ఉత్సవాలు మేము నిర్వహించుకుంటాం.
సత్తిబాబు, శ్రీరామగిరి
కలెక్టర్కు విన్నవించాం : ప్రధాన ఆలయం పోలవరం పూర్తయినా మునిగిపోదు. చుట్టూ జలమయమవుతుంది. నిర్వాసిత గ్రామాలను తరలించేలోపు పోలవరం ముంపులోని దేవాలయాలకు మరొక చోట స్థలాలు చూపించాలని జిల్లా కలెక్టర్కు విన్నవించాం. స్థలం చూపకముందే గ్రామాలు ఖాళీ చేస్తే, అప్పుడు ఏం చేయాలో మాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
లక్ష్మీకుమార్, ఆలయ ఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..