logo

తీరిన సంతకాల సమస్య

సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు సంతకాల సమస్య తీరింది. జీకేవీధి ఎంపీడీవో అత్యవసరంగా సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలు ఎవరూ చూడక కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Published : 03 Jun 2023 02:39 IST

సచివాలయం ఉద్యోగి దరఖాస్తుపై సంతకం చేస్తున్న ఇన్‌ఛార్జి ఎంపీడీవో ఇమ్మానుయేల్‌

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు సంతకాల సమస్య తీరింది. జీకేవీధి ఎంపీడీవో అత్యవసరంగా సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలు ఎవరూ చూడక కార్యకలాపాలు నిలిచిపోయాయి. సచివాలయాల ఉద్యోగులు సంతకాల కోసం తిరిగినా ఫలితం లేకపోవడంపై ‘సెలవులో సారు..బాధ్యులెవరూ..?’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా పరిషత్‌ అధికారులు స్థానిక సీనియర్‌ అసిస్టెంట్‌ ఇమ్మానుయేల్‌కు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. కార్యాలయానికి వచ్చిన సచివాలయాల ఉద్యోగులకు సంతకాలు చేసి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని