వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఇకపై తామంతా వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రత్యక్షంగా పనిచేస్తామని చెబుతున్నారు.
పెదబయలులో రాజీనామా పత్రాలను ఈవోపీఆర్డీ నర్సింగరావుకు అందజేస్తున్న వాలంటీర్లు
పాడేరు, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, చింత పల్లి, న్యూస్టుడే: ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఇకపై తామంతా వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రత్యక్షంగా పనిచేస్తామని చెబుతున్నారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనాపల్లి సచివాలయం పరిధిలో 16 మంది రాజీనామా చేస్తున్నట్లు స్థానిక సచివాలయ కార్యదర్శి కళ్యాణ్కృష్ణకు లేఖ అందించారు. కొయ్యూరు మండలంలోని ఆరు పంచాయతీల్లోని 45 మంది సోమవారం రాజీనామా చేశారు. శరభన్నపాలెం సచివాలయంలో ఆరుగురు, కొమ్మికలో 11 మంది, కంఠారం ఏడుగురు, చింతలపూడిలో 10 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఎంపీడీవో సీతయ్య తెలిపారు. చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పంచాయతీల్లో పని చేస్తున్న సుమారు 136 మంది తమ రాజీనామాలను ఎంపీడీఓ వీరసాయిబాబు, ఈఓపీఆర్డీ శ్రీనివాస్కు అందజేశారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.
పెదబయలు గ్రామీణం, న్యూస్టుడే: పెదబయలు మండలంలో 45 మంది గ్రామ వాలంటీర్లు సోమవారం ఈవోపీఆర్డీ నర్సింగరావుకు రాజీనామా పత్రాలు అందజేశారు. వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తామన్నారు.
ఇలా రాజీనామా... అలా వైకాపా నేతలతో సమావేశాలు
వైకాపా పాడేరు అసెంబ్లీ పరిశీలకులు శ్రీకాంత్రాజును కలిసిన చింతపల్లి మండల వాలంటీర్లు
చింతపల్లి, న్యూస్టుడే: వాలంటీర్ల రాజీనామాలు పూర్తిగా వైకాపా నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నడానికి సోమవారం చింతపల్లి జరిగిన సన్నివేశాలే నిదర్శనం. పెద్ద ఎత్తున రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా కొద్ది క్షణాల్లోనే చింతపల్లిలో ఒక ప్రైవేటు రిసార్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే ఉన్న వైకాపా పాడేరు అసెంబ్లీ పరిశీలకులు శ్రీకాంత్ రాజు కలిశారు. జగనన్న సైన్యంగా ఇక నుంచి తాము పని చేస్తామని బాహాటంగానే ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 29-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది, -
అర్ధరాత్రి నిద్రిస్తుండగా కత్తితో నరికి..
[ 29-04-2024]
శుభ కార్యక్రమానికి వెళ్లి మేడపై నిద్రిస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి వేళ కిరాతకంగా హతమార్చిన ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పెదబయలు ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజ్(33), పెదబయలు మండలం ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందర్రావుకు మధ్యలో రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి తెదేపాలో చేరిక
[ 29-04-2024]
రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు. -
ఓటేయాలంటే.. తుమ్మిలేరులో తంటాలే
[ 29-04-2024]
గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్ కేంద్రం ఉంది. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు. -
జగన్కు ఓటేస్తే ఆటవిక పాలనను ఆహ్వానించినట్లే
[ 29-04-2024]
వైకాపా నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
నిర్మాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం..
[ 29-04-2024]
గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం.
తాజా వార్తలు (Latest News)
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505