logo

లోయలో పడిన ఆటో.. డ్రైవర్‌ దుర్మరణం

వివాహానికి హాజరై స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా లోయలోకి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ చింతగున్నల గ్రామానికి చెందిన పాంగి కృష్ణబాబు(22).

Published : 17 Apr 2024 02:26 IST

పాడేరు, న్యూస్‌టుడే: వివాహానికి హాజరై స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా లోయలోకి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ చింతగున్నల గ్రామానికి చెందిన పాంగి కృష్ణబాబు(22), మర్రి నూకరాజు, మరో ఏడుగురు కలిసి ఆటోలో  సలుగు పంచాయతీ రంగసింగిపాడులో బంధువు వివాహానికి మంగళవారం వెళ్లారు. తిరిగి సాయంత్రం గ్రామానికి వస్తుండగా పూలబంద-కక్కి సమీపంలో ఆటో అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కృష్ణబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. నూకరాజు తీవ్రగాయాలపాలయ్యాడు. మృతుడికి భార్య, రెండేళ్ల పాప ఉన్నారు. భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. నూకరాజు పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగతా ఏడుగురు క్షేమంగానే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆటో సుమారు 15 అడుగుల లోయలోకి వెళ్లిపోయింది. పాడేరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు