ఘాట్రోడ్లకు జగన్ పోటు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రధానమైన రెండు ఘాట్రోడ్లు ప్రమాదకరంగా మారాయి. పాడేరు, అరకులోయ ఘాటీలు అధ్వానంగా తయారయ్యాయి. వీటి నిర్వహణను వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.
నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం
తరచూ ప్రమాదాలు
పాడేరు, అరకులోయ, న్యూస్టుడే
- పాడేరు ఘాట్రోడ్లోని వంట్లమామిడి సమీపంలో ఐదేళ్ల క్రితం చింతపండు లోడుతో వెళుతున్న ఓ ల్యారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
- 2020లో వంట్లమామిడి వద్ద కాకినాడకు చెందిన ఓ బస్సు ప్రయాణికులతో వెళుతూ బ్రేక్లు ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. కందమామిడి మలుపు వద్ద గత మూడేళ్లలో ఐదుగురు యువకులు వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
- ఈనెల 4వ తేదీన ఒడిశా రాష్ట్రం నుంచి వలస కూలీలు వ్యాన్లో విజయవాడ వెళ్తుండగా పాడేరు ఘాట్రోడ్లోని ఏసుక్రీస్తు బొమ్మ మలుపు సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రగాయాలయ్యారు. 22 మంది స్వల్పగాయాలపాలయ్యారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రధానమైన రెండు ఘాట్రోడ్లు ప్రమాదకరంగా మారాయి. పాడేరు, అరకులోయ ఘాటీలు అధ్వానంగా తయారయ్యాయి. వీటి నిర్వహణను వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. తరచూ ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నా సీఎం జగన్కు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఈ ప్రాంతాలకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు తరలివస్తుంటారు. వారికి ఈ మార్గాలపై అవగాహన లేక ప్రమాదాలకు గురవుతున్నారు. కనీసం ఇక్కడ రక్షణ సూచీలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
అరకులోయ ఘాట్రోడ్డు 45 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మార్గంలో ప్రమాదకర ప్రదేశాలు 50 వరకు ఉన్నాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో అరకులోయ- విశాఖపట్నం మార్గం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అరకు నుంచి పెందుర్తి వరకు ఉన్న ప్రధాన రహదారి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐదేళ్ల పాటు రహదారి నిర్వహణకు ప్రపంచబ్యాంకు నిధులు రూ. 21 కోట్లు కేటాయించింది. ఆ ఐదేళ్ల పాటు ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా రోజుల వ్యవధిలోనే సమస్య పరిష్కరించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అరకులోయ నుంచి విశాఖపట్నం మార్గంలోని ఘాట్రోడ్డును పూర్తిగా విస్మరించారు. గుంతలమయంగా మారిన రహదారికి మరమ్మతులు మర్చిపోయారు. ఎక్కడపడితే అక్కడ రక్షణ గోడలు పూర్తిగా పాడైపోయాయి. ఇక్కడ వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ మార్గంలో 7 హెయిర్పిన్ బెండ్లు ఉన్నాయి. వాటివద్ద ఏర్పాటు చేసిన రెయిలింగ్లు, రక్షణ గోడలు చాలా వరకు పాడైపోయాయి. సుమారు 15 చోట్ల రక్షణగోడలు బాగా దెబ్బతిన్నాయి. టైడా జంగిల్బెల్స్ సమీపంలోని మలుపు వద్ద రక్షణగోడ పూర్తిగా కూలిపోయింది. గాలికొండలున్న సుమారు ఐదు కిలోమీటర్ల మార్గంలో పది చోట్ల కొండపై నుంచి బండరాళ్లు జారి రహదారి పక్కగా పడిపోయాయి. సుంకరమెట్ట, డముకు తదితర ప్రదేశాల్లో రహదారి గుంతలుపడి పలువురు గాయాలపాలవుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ రహదారిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది. కొంత ప్రాంతాన్ని ఎన్హెచ్ అధికారులు బాగు చేసినా తర్వాత వదిలేశారు.
పురాతన మార్గం
పాడేరు ఘాట్రోడ్డులో ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. దీన్ని సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించారు. గతంలో మాజీ మంత్రి బాలరాజు హయాంలో దీని విస్తరణ పనులు చేపట్టారు. అప్పటి వరకు ఐదు మీటర్లున్న రహదారిని ఏడు మీటర్ల వరకు విస్తరించారు. ప్రమాదకర మలుపుల వద్ద మాత్రం వెడల్పు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 29-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది, -
అర్ధరాత్రి నిద్రిస్తుండగా కత్తితో నరికి..
[ 29-04-2024]
శుభ కార్యక్రమానికి వెళ్లి మేడపై నిద్రిస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి వేళ కిరాతకంగా హతమార్చిన ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పెదబయలు ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజ్(33), పెదబయలు మండలం ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందర్రావుకు మధ్యలో రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి తెదేపాలో చేరిక
[ 29-04-2024]
రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు. -
ఓటేయాలంటే.. తుమ్మిలేరులో తంటాలే
[ 29-04-2024]
గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్ కేంద్రం ఉంది. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు. -
జగన్కు ఓటేస్తే ఆటవిక పాలనను ఆహ్వానించినట్లే
[ 29-04-2024]
వైకాపా నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
నిర్మాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం..
[ 29-04-2024]
గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్