logo

బైకు అదుపుతప్పి ఆర్మీ ఉద్యోగి దుర్మరణం

బైకు అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడిన ఘటనలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. చీడికాడ మండలం పెదగోగాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Published : 18 Apr 2024 01:56 IST

అత్తారింటికి వెళ్తుండగా ప్రమాదం

చీడికాడ, న్యూస్‌టుడే: బైకు అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడిన ఘటనలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. చీడికాడ మండలం పెదగోగాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి పడాల వరహాలు (32) మంగళవారం సాయంత్రం దేవరాపల్లి మండలం వాకపల్లిలోని అత్తారింటికి బయలుదేరాడు. ఈ క్రమంలో పెదగోగాడ సమీపంలో గెడ్డ వద్ద బైకు అదుపుతప్పి కల్వర్టు మీదుగా కాలువలో పడ్డాడు. బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు పక్కనైనా కాలువ లోతుగా ఉండటంతో ఎవరూ గమనించలేదు. బుధవారం మధ్యాహ్నం పశువుల కాపరి అటుగా వెళ్తుండగా కాలువలో నీటిపై మృతదేహం తేలుతుండటం గమనించి గ్రామస్థులకు చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నారాయణరావు సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై చెప్పారు.


మెట్లపై నుంచి జారిపడి ఆటో డ్రైవర్‌ మృతి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తుమ్మపాలలో మెట్లపై నుంచి జారిపడి చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందాడు. దాసరి కృష్ణ (43) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 14న ఇంటి వద్ద ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డాడు. తలకు బలమైన గాయమవడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు పంపగా బుధవారం మృతి చెందినట్లు మృతుడి భార్య వెంకట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శంకరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని