logo

కూటమికి మద్దతుగా వేల కి.మీ. బైకుపై ప్రచారం

తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్‌ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్‌పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

Published : 18 Apr 2024 02:06 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్‌ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్‌పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ బైకుపై ప్రచార యాత్ర ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన శ్రీకారం చుట్టారు. శిరస్త్రాణంపై గ్లాసు, సైకిల్‌, కమలం గుర్తులు, మెడలో మూడు పార్టీల కండువాలు, ముఖానికి రంగులు పూసుకుని ఖాకీ దుస్తుల్లో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తనతోపాటు ఓ కొండముచ్చునూ తిప్పుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చేరుకున్న ఆయన బుధవారం మాట్లాడుతూ.. జనసేన పార్టీ అంటే ఇష్టం. ఆ పార్టీతోపాటు కూటమిలోని తెదేపా, భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నా. ఇప్పటికి సుమారు రెండు వేల కి.మీ. దూరం ప్రయాణించినట్లు చెప్పారు. వైకాపా నాయకులు ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని చూసినా ఈసారి జగన్‌ను నమ్మరని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు. గతంలో మా నాన్న భాస్కరరావు తెదేపాకు మద్దతుగా పది వేల కి.మీ. సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేశారని, ఆయన స్ఫూర్తితోనే బైక్‌ ప్రచారం ప్రారంభించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని