కూటమికి మద్దతుగా వేల కి.మీ. బైకుపై ప్రచారం
తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ బైకుపై ప్రచార యాత్ర ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన శ్రీకారం చుట్టారు. శిరస్త్రాణంపై గ్లాసు, సైకిల్, కమలం గుర్తులు, మెడలో మూడు పార్టీల కండువాలు, ముఖానికి రంగులు పూసుకుని ఖాకీ దుస్తుల్లో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తనతోపాటు ఓ కొండముచ్చునూ తిప్పుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చేరుకున్న ఆయన బుధవారం మాట్లాడుతూ.. జనసేన పార్టీ అంటే ఇష్టం. ఆ పార్టీతోపాటు కూటమిలోని తెదేపా, భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నా. ఇప్పటికి సుమారు రెండు వేల కి.మీ. దూరం ప్రయాణించినట్లు చెప్పారు. వైకాపా నాయకులు ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని చూసినా ఈసారి జగన్ను నమ్మరని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు. గతంలో మా నాన్న భాస్కరరావు తెదేపాకు మద్దతుగా పది వేల కి.మీ. సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేశారని, ఆయన స్ఫూర్తితోనే బైక్ ప్రచారం ప్రారంభించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
అవినీతిపరులకు భాజపా కేరాఫ్గా మారింది: కేటీఆర్
-
స్టాయినిస్ అర్ధశతకం.. ముంబయిపై లఖ్నవూ విజయం
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు