logo

వైకాపా రెబల్‌గా వంతల రామన్న

అరకులోయలో అసెంబ్లీ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు వైకాపా నాయకుడు వంతల రామన్న తెలిపారు. అరకులోయలో బుధవారం తన మద్దతుదారులు, వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు.

Published : 18 Apr 2024 02:17 IST

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయలో అసెంబ్లీ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు వైకాపా నాయకుడు వంతల రామన్న తెలిపారు. అరకులోయలో బుధవారం తన మద్దతుదారులు, వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచి స్థాయి నుంచి వైకాపాలో ఉంటూ సుమారు ఎనిమిదేళ్లగా పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. వైకాపా అధిష్ఠానం తనని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిమజాతి గిరిజనుడినైన తాను నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ పర్యటించి ప్రజల బాధలు తెలుసుకున్నానని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వైకాపాను వీడి తెదేపాలో చేరినప్పుడు వైకాపాలో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశానని పేర్కొన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. ప్రజలంతా తనకు మద్దతు పలకాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు