నామినేషన్ల పర్వం నేటి నుంచి
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
పాడేరు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో అరకులోయ, కలెక్టరేట్లోని జేసీ కార్యాలయంలో పాడేరు, రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. పరిశీలన అనంతరం అధికారులు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. వివిధ పార్టీల తరపున పోటీ చేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ల దాఖలుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి కిల్లు వెంకట రమేష్ నాయుడు ఈనెల 19వ తేదీన నామినేషన్ వేయనున్నారు. వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు అదే రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతక బుల్లిబాబు 25వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.