రేషన్లో కోత.. ధరల వాత
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు.
కందిపప్పు పంపిణీపై చేతులేత్తేసిన జగన్
ఈనాడు-అనకాపల్లి, న్యూస్టుడే- పాడేరు
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. కందిపప్పు ఏ నెలా సక్రమంగా సరఫరా చేయడం లేదు. కాగితాల్లో కేటాయింపులు చూపిస్తున్నా గోదాములకు నిల్వలు చేరడం లేదు. పప్పులే కాదు మిగతా సరకులు అరకొరగానే అందిస్తున్నారు. ఒకనెల పంచదార ఇస్తే మరోనెల గోధుమపిండి ఇస్తున్నారు. ఎప్పుడూ పూర్తిస్థాయిలో రేషన్ అందడం లేదు. పైగా వైకాపా సర్కారు వచ్చాక రేషన్ సరకుల ధరలు పెంచేసి పేదలపై భారీగా భారం మోపారు.
ఉమ్మడి జిల్లాలో 12.38 లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులున్నాయి. కార్డులో ప్రతి కుటుంబ సభ్యునికి ఐదు కేజీల చొప్పున బియ్యం, ఒక్కో కార్డుకు కేజీ కందిపప్పు, అరకేజీ పంచదార ఇవ్వాలి. తెదేపా హయాంలో కేజీ కందిపప్పు రూ.40 చొప్పున రెండు కేజీలు అందజేసేవారు. వైకాపా సర్కారు వచ్చాక కందిపప్పు పరిమాణం కేజీకి తగ్గించేసి.. ధర రూ.67కు పెంచేశారు. అలాగే రూ.10కు అందజేసే అరకేజీ పంచదారను రూ.17కు పెంచారు. అంటే ఒక్కో కార్డుపై రూ.34 అదనంగా భారం పడుతోంది. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద 12.28 లక్షల కార్డుదారులపై నెలకు రూ.4.38 కోట్ల ధరల భారం మోపారు. పోనీ సరకులైనా సక్రమంగా అందిస్తున్నారా అంటే అదీ లేదు. జిల్లాలోని కార్డుదారులందరికీ కేజీ కందిపప్పు చొప్పున అందించాలంటే నెలకు 1,238 మెట్రిక్ టన్నులు అవసరం. ఆ మేరకు నిల్వలు ఏ నెలా రేషన్ దుకాణాలకు చేరడం లేదు. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కందిపప్పు కనీస నిల్వలు కూడా పంపించలేకపోయారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయలేక బియ్యం, పంచదారతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గోధుమపిండి ఇస్తున్నా, నాణ్యత బాగోలేక తీసుకోవడానికి కార్డుదారులు ఇష్టపడడం లేదు.
రేషన్ కందిపప్పు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాయితీపై కేజీ రూ.67 చొప్పున ఇవ్వాల్సి ఉండగా ఈ నెల రాలేదు బయటే కొనుక్కోండి అనే మాటే ఎక్కువ వినిపిస్తోంది. బయట మార్కెట్లో కేజీ రూ.160 నుంచి రూ.170 పలుకుతోంది. అంటే రేషన్ దుకాణాల కంటే బయట కేజికి అదనంగా రూ. 90 నుంచి రూ.100 పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అంత డబ్బులు పెట్టి పప్పులు కొనలేక పేదలు చింతపండు చారుకే పరిమితం అవుతున్నారు.
కేంద్రం బియ్యంతో జగన్ ప్రచారం..
కొవిడ్ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా బియ్యం పంపిణీ చేస్తుండేవి. కేంద్రం ఉచితంగా ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 చొప్పున ఇస్తుండేది. గత రెండేళ్లుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై) ద్వారా ఉచిత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేజీ రూపాయి బియ్యాన్ని నిలిపేసింది. ఆ మేరకు బియ్యంపై చేసే రూ.కోట్ల ఖర్చును ప్రభుత్వం మిగుల్చుకుంది. కందిపప్పు సరఫరాపైనా చేతులేత్తేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం అరకేజీ పంచదార మాత్రమే కార్డుదారుకు అందిస్తోంది. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని జగన్ బొమ్మలతో ఎండీయూ వాహనాల్లో చేరవేసి తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.