విజ్ఞానం పెట్టెలకే పరిమితం
విద్యార్థి దశలో విజ్ఞానంపై ఆలోచనలు రేకెత్తించి, ఆసక్తి కలిగిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వారు తమ లక్ష్యాలకు అనుగుణంగా పురోగమిస్తారు. ఆ ఆసక్తి వారిని విభిన్న రంగాల్లో పరిశోధకులుగా తీర్చిదిద్దుతుంది. పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి స్థాయిలోనే
సైన్సు పరికరాలు అలంకారప్రాయం
మండవల్లి ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలలో విద్యార్థులు
మండవల్లి, న్యూస్టుడే : విద్యార్థి దశలో విజ్ఞానంపై ఆలోచనలు రేకెత్తించి, ఆసక్తి కలిగిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వారు తమ లక్ష్యాలకు అనుగుణంగా పురోగమిస్తారు. ఆ ఆసక్తి వారిని విభిన్న రంగాల్లో పరిశోధకులుగా తీర్చిదిద్దుతుంది. పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి స్థాయిలోనే విద్యార్థులు ఆయా రంగాల వైపు దృష్టిసారించి పూర్తి అవగాహన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేయాలని విద్యా, సాంకేతిక నిపుణులు ముక్తకంఠంతో కోరుతున్నారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించి విద్యార్థులను సైన్స్ పట్ల ఆకర్షితులుగా చేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
ఉన్నత పాఠశాలల విషయానికొస్తే అవి ఎంత వరకు సక్రమంగా అమలవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ప్రయోగశాలలు అంతంత మాత్రంగానే ఉండడంతో పలు చోట్ల ప్రయోగ తరగతులు మొక్కుబడిగానే మారుతున్నాయి. ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలలుగా రూపొందిన వాటిలో నేటికీ కనీసం ప్రయోగశాలలు లేవు. దీంతో విద్యార్థులు సాంకేతిక, సైన్స్ అంశాలకు దూరం అవుతున్నారు.
నాసిరకమే..
కైకలూరు నియోజకవర్గంలో మండవల్లి, ముదినేపల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో 30 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఆర్ఎంఎస్ఏ ద్వారా ప్రయోగ పరికరాలు సమకూర్చుకున్నారు. వీటిలో ఎక్కువ శాతం నాసికరంగా ఉండడంతో వాటిని వినియోగించేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు, మూలకాలు, వస్తువులను విద్యాశాఖ ఉన్నతాధికారుల జోక్యంతోనే పాఠశాలలకు చేరుతున్నాయి. అలా కాకుండా ఇందుకు సంబంధించిన బడ్జెట్ను క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు కేటాయిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటుంది. ఉన్నత పాఠశాలల్లోని ప్రయోగశాలలను ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దితే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా విద్యాశాఖాధికారులు కార్యాచరణ చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇంగిలిపాకలంకలో పెట్టెల్లో భద్రంగా ఉన్న పరికరాలు
ప్రదర్శనకేదీ చోటు
నియోజవకర్గంలో చాలా పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ పంపుతున్న వస్తువులన్ని బీరువాల్లోకే చేరుతున్నాయి. ముఖ్యంగా స్థాయి పెరిగిన ప్రతి పాఠశాలలో ల్యాబ్ కొరత వేధిస్తోంది. మండవల్లి మండలంలో లోకుమూడి, పుట్లచెరువు, ఇంగిలిపాకలంక గ్రామాల్లో ప్రయోగశాలలు లేకపోవడంతో ఉపాధ్యాయులు వారికి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. పుస్తకాల్లో బొమ్మల ఆధారంగా విద్యార్థులు పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో విద్యార్థులు పరీక్షల్లో పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు.
ఆధునిక సదుపాయాలు అవసరం
ఉన్నత పాఠశాలల్లో ప్రయోగశాలలను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలి. పరికరాలు, సౌకర్యాలతో పాటు, సైన్సు ప్రదర్శన గదులను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు వెళ్లాలంటే పాఠశాలల్లో అందుకు అవసరమైన అన్ని అంశాలపై ప్రయోగాలను సొంతంగా నిర్వహించే స్థాయికి చేరుకునేలా తీర్చిదిద్దాలి. అందుకే పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు ఎంతో అవసరం. అప్పుడే మంచి ఫలితాల సాధనకు వీలుంటుంది. - శ్యామ్కుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు, కానుకొల్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 05-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ !
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. -
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు