విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు
విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడుతున్నా పాఠశాలలు నిర్వహించి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దావు నాగరాజు కోరారు. అల్లూరు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందనే
ముదినేపల్లి: ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న నాగరాజు, గ్రామస్థులు
అల్లూరు (ముదినేపల్లి), న్యూస్టుడే: విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడుతున్నా పాఠశాలలు నిర్వహించి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దావు నాగరాజు కోరారు. అల్లూరు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందనే సమాచారంతో ఆయన, గ్రామస్థులు కలిసి ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉన్నత పాఠశాలలో ఎనిమిది మందికి ముగ్గురే ఉపాధ్యాయులు రావటం, ప్రాథమిక పాఠశాలలో మరొకరికి పాజిటివ్ నిర్ధారణ అయిందనే విషయమై నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికీ పాఠశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదని, ఉపాధ్యాయులే మాస్క్లు ధరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉపాధ్యాయురాలు పిల్లలతో మందులు తెప్పిచుకున్నారని, ఈ తరుణంలో విద్యార్థుల ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉన్నవారిని పాఠశాలకు రానివ్వద్దని కోరారు.
నిబంధనల మేరకు తరగతులు
తిరువూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొవిడ్ నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల వృత్తి విద్యాశాఖాధికారి (డీవీఈవో) బీఎస్ఆర్వీ ప్రసాద్ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అధ్యాపకులు నిర్దుష్ట ప్రణాళికతో బోధించాలని సూచించారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాతల సహకారంతో కళాశాలకు వసతులు సమకూర్చిన ప్రిన్సిపల్ రెబ్బు మురళీకృష్ణను అభినందించారు. అనంతరం ఆయన కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరంలో రెడ్ జోన్ అమలు
[ 07-05-2024]
ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్జోన్ (నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. -
నాలుగు సార్లు గెలిపించినా.. నీరివ్వరేమని
[ 07-05-2024]
గుడివాడలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఆ పాపం కచ్చితంగా ఎమ్మెల్యే కొడాలి నానిదే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ను వరుసగా నాలుగుసార్లు శాసనసభకు పంపించిన ప్రజల కష్టాలకు ఏమాత్రం చలించకుండా బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోయారు. -
వైకాపా నాయకుల ఒత్తిడితో 122 మంది వాలంటీర్ల రాజీనామా
[ 07-05-2024]
ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. -
ఆశీర్వదించండి...అండగా ఉంటా: కొల్లు
[ 07-05-2024]
ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. -
మూడు వంతెనలన్నారు.. రైతులను ముంచారు
[ 07-05-2024]
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్ ప్రజలను మోసం చేశారు. -
రాక్షస సంహారానికే కూటమి : నారా రోహిత్
[ 07-05-2024]
కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సినీ నటుడు నారా రోహిత్, హాస్య నటుడు రఘు, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) కుమారుడు వెంకట్, ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్యలతో కలిసి ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడులో రోడ్షో నిర్వహించారు. -
నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీలంటూనే దాడులు
[ 07-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
[ 07-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నందిగామలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. -
తుమ్మలపల్లి కళా క్షేత్రంలో పోస్టల్ బ్యాలట్ సదుపాయం
[ 07-05-2024]
నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలట్ వినియోగ సౌకర్యాన్ని ఈ నెల 7, 8 తేదీల్లో కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
నేటి నుంచి హోమ్ ఓటింగ్
[ 07-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఇంటి వద్దే (హోమ్) ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)