ఉద్యోగం, కాంట్రాక్టు పేరుతో మోసం
ఉద్యోగం లేదంటే ఏదైనా కాంట్రాక్టు ఇప్పిస్తానని సుమారు రూ.10 లక్షల మేర తీసుకుని మోసగించిన వ్యక్తిపై కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
నకిలీ సబ్ కలెక్టర్ లీలలు..
చిట్టినగర్, న్యూస్టుడే: ఉద్యోగం లేదంటే ఏదైనా కాంట్రాక్టు ఇప్పిస్తానని సుమారు రూ.10 లక్షల మేర తీసుకుని మోసగించిన వ్యక్తిపై కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిట్టినగర్ వెంకటేశ్వరస్వామి గుడిలో పూజారిగా వినుకొండ రత్నమాచార్యులు పని చేస్తున్నారు. ఆ గుడికి కొత్తపేటకు చెందిన పిళ్లా వెంకట రాజేంద్ర, తన భార్య మహాలక్ష్మి గుడికి వచ్చి పూజలు చేయించుకునేవారు. వెంకట రాజేంద్ర తాను పౌరసరఫరాల శాఖ సబ్ కలెక్టర్నని, ఐఏఎస్లు, ఐపీఎస్లు బాగా తెలుసని, పలుకుబడి ఉందని చెప్పాడు. పూజారి భార్య ఎం.కాం వరకు చదివి ఇంట్లోనే ఉంటుందని చెప్పగా బుక్ స్టేషనరీ కాంట్రాక్టు గానీ, ప్రభుత్వ ఉద్యోగం గానీ ఇప్పిస్తానని నమ్మబలికాడు. రెండేళ్లుగా పరిచయం ఉండటంతో వెంకట రాజేంద్రను పూజారి నమ్మాడు. ఎంత ఖర్చు అవుతుందని అడిగాడు. రూ.8లక్షలకు పైగా ఖర్చవుతుందని అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో 2022 జనవరి, ఫిబ్రవరిలో పలు దఫాలుగా వెంకట రాజేంద్రకు పూజారి డబ్బులు ఇచ్చాడు. రూ.1,10,000 విలువైన ఐ ఫోన్ కొనుగోలు చేసి వెంకట రాజేంద్ర భార్యకు ఇచ్చాడు. ఇలా మొత్తం రూ.9,91,500లు చెల్లించాడు. అప్పటి నుంచి ఉద్యోగం, కాంట్రాక్టు ఇప్పించకుండా కాలయాపన చేస్తూ వెంకట రాజేంద్ర తప్పించుకు తిరుగుతున్నాడు. పెద్దల సమక్షంలో మాట్లాడితే రూ.9,50,000 15 రోజుల్లో ఇస్తానని చెప్పాడు. గడువు పూర్తయినా డబ్బులు ఇవ్వలేదు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయినట్లు పూజారి గుర్తించారు. వంశీకృష్ణ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో వెంకట రాజేంద్రకు రూ.10 లక్షలు ఇచ్చి మోసపోయినట్లు తనకు తెలుసని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూజారి పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు