అప్రమత్తతతో మెలగాలి..!
‘పది’ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. గతేడాది ఏడు పేపర్లు పెట్టగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాటిని ఆరు పేపర్లకే కుదించి పరీక్షలు నిర్వహించేలా పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
ఫిజిక్స్, ఎన్ఎస్ పరీక్షపై విద్యార్థుల్లో ఆందోళన
ప్రతి 15 నిమిషాలకు గుర్తుచేయాలని అధికారుల ఆదేశం
ఈనాడు, అమరావతి
‘పది’ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. గతేడాది ఏడు పేపర్లు పెట్టగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాటిని ఆరు పేపర్లకే కుదించి పరీక్షలు నిర్వహించేలా పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిజిక్స్, నేచురల్ సైన్స్(ఎన్ఎస్)కు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు, వేర్వేరుగా ఆన్సర్ బుక్లెట్లు ఇస్తారు. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో బాగా ఆందోళన నెలకొంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ప్రీ పబ్లిక్ పరీక్షలో ప్రాక్టీస్ చేయించినా చాలా స్కూళ్లల్లో విద్యార్థులు ఫిజిక్స్ ఆన్సర్ బుక్లెట్లో ఎన్ఎస్ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాశారు. ఈ పొరపాటు పబ్లిక్ పరీక్షలో పునరావృతమైతే అంతిమంగా విద్యార్థులు నష్టపోతారని గుర్తు చేస్తున్నారు. రెండు ప్రశ్నపత్రాలు, రెండు ఆన్సర్ బుక్లెట్లు ఒకేసారి ఇస్తారు. దీంతో విద్యార్థులు వారికి ఏ పేపర్ తేలిగ్గా ఉందో దాన్ని ముందుగా రాసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ సమాధాన పత్రాలు వేర్వేరు ఆన్సర్ షీట్లపై రాయాల్సి ఉంది. దీంతో వాటిని రాసే క్రమంలో ఏదైనా పొరపాటున ఒక దానిపై రాయాల్సింది మరోదానిపై రాస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి వేర్వేరుగా కాకుండా ఒకే ఆన్సర్బుక్లెట్లో సమాధానాలు రాసేలా వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే ఉపాధ్యాయులు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. పిల్లలకు ఈ నూతన విధానం అలవాటు కావాలని, ఎన్సీఈఆర్టీ పరీక్షలు రాసేవారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా మూడు పేపర్లు విడివిడిగా రాస్తారని, కనీసం మన విద్యార్థులు రెండు పేపర్లయినా రాయకపోతే ఎలా అని చెప్పి పాఠశాల విద్యాశాఖ రెండు పేపర్లు వేర్వురుగా రాసేలా ఈ ఏడాది నూతన విధానం ప్రవేశపెట్టింది.
ఎలా రాస్తారోననే సందేహం...
గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఎన్నడూ లేనంత తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. అంతకుముందు ఏడాది వరకూ ఎప్పుడూ 90శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదవ్వలేదు. అలాంటిది గతేడాది 65.21 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 34.79 శాతం మంది పరీక్షలు తప్పారు. గతేడాది ఒక్క విద్యార్థి కూడా పాసవ్వని బడులు కూడా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది ఉన్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పదో తరగతి పిల్లల్లో సామర్థ్యాలు పరిశీలించగా.. ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం, తెలుగు సహా అన్నింట్లోనూ బలహీనంగా ఉన్న విషయం బయటపడింది. ఈ సవాళ్ల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారో, ఉత్తీర్ణత ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయుల్లో నెలకొంది.
సీరియల్ నంబరు వేర్వేరుగానే..
సీరియల్ నంబరు ఒకటి నుంచి 16 వరకు ఫిజిక్స్, 17 నుంచి 33వ ప్రశ్న దాకా ఎన్ఎస్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పొరపాటున 17వ నంబరు ప్రశ్నకు ఫిజిక్స్ సమాధాన పత్రంలో రాస్తే ఆ మేరకు ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. ఇది లేకుండా ఉండాలంటే 1 నుంచి 16 దాకా ఫిజిక్స్ ప్రశ్నావళికి ఆ ఆన్సర్ బుక్లెట్పైనే రాయాలి. ఎన్ఎస్కు కేటాయించిన 17 నుంచి 33 నంబర్ల దాకా సంబంధిత ఆన్సర్షీట్పై సమాధానాలు రాయాలని ప్రతి 15 నిమిషాలకు ఇన్విజిలేటర్లు గుర్తు చేస్తూ పిల్లలను అప్రమత్తం చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని ప్రతి పరీక్ష గదిలో బోర్డుపై సైతం రాయాలని సూచించారు. తాము ఎంత ప్రాక్టీస్ చేయించినా ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షలోనే అయోమయం చెంది ఒకటే బుక్లెట్పై ఫిజిక్స్, ఎన్ఎస్కు సమాధానాలు రాశారని పలువురు హెచ్ఎంలు తెలిపారు. పరీక్ష ఒకే రోజు పెడుతున్నప్పుడు ఆన్సర్షీట్ సైతం రెండింటికి కలిపి ఒకటే ఇచ్చి రాయమంటే బాగుండేదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది.
జిల్లాలో ..
పరీక్షలు రాయబోయే విద్యార్థులు: 30,134
మొత్తం కేంద్రాలు: 154
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందరు సాక్షిగా జగన్ అబద్ధాలు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు. -
జగన్ నిర్వాకం.. యువశక్తి నిర్వీర్యం
[ 07-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలచుకుంటే యువత గుండెలు బరువెక్కిపోతున్నాయి. కోపంతో రగిలిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయి.. జీవితంలో స్థిరపడలేక.. తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేక.. వైకాపా ప్రభుత్వ చేతకానితనానికి బలైపోయిన యువత దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
ఓటుకు రేటు..!
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో అది కీలక నియోజకవర్గం. అక్కడ అభివృద్ధి లేక.. స్థానిక ప్రజాప్రతినిధి బూతులు వినలేక.. సకల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనం ఈసారి స్పష్టమైన మార్పు కోరుతున్నారు. -
వివరాలు రాలేదని ఓటు వేయనీయలేదు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. -
నగరంలో రెడ్ జోన్ అమలు
[ 07-05-2024]
ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్జోన్ (నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. -
నాలుగు సార్లు గెలిపించినా.. నీరివ్వరేమని
[ 07-05-2024]
గుడివాడలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఆ పాపం కచ్చితంగా ఎమ్మెల్యే కొడాలి నానిదే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ను వరుసగా నాలుగుసార్లు శాసనసభకు పంపించిన ప్రజల కష్టాలకు ఏమాత్రం చలించకుండా బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోయారు. -
వైకాపా నాయకుల ఒత్తిడితో 122 మంది వాలంటీర్ల రాజీనామా
[ 07-05-2024]
ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. -
ఆశీర్వదించండి...అండగా ఉంటా: కొల్లు
[ 07-05-2024]
ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. -
మూడు వంతెనలన్నారు.. రైతులను ముంచారు
[ 07-05-2024]
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్ ప్రజలను మోసం చేశారు. -
రాక్షస సంహారానికే కూటమి : నారా రోహిత్
[ 07-05-2024]
కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సినీ నటుడు నారా రోహిత్, హాస్య నటుడు రఘు, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) కుమారుడు వెంకట్, ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్యలతో కలిసి ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడులో రోడ్షో నిర్వహించారు. -
నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీలంటూనే దాడులు
[ 07-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
[ 07-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నందిగామలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. -
తుమ్మలపల్లి కళా క్షేత్రంలో పోస్టల్ బ్యాలట్ సదుపాయం
[ 07-05-2024]
నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలట్ వినియోగ సౌకర్యాన్ని ఈ నెల 7, 8 తేదీల్లో కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
నేటి నుంచి హోమ్ ఓటింగ్
[ 07-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఇంటి వద్దే (హోమ్) ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి