Vijayawada: నువ్వు కట్టేయ్.. నే చూసుకుంటా.. వెలంపల్లి అరాచకం..
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నానుడి. కానీ ఇపుడు ‘రాజు’ గారు తలుచుకుంటే అసాధ్యం... సుసాధ్యం అవుతుందంటున్నారు మధురానగర్ వాసులు.
ఇరుకు దారిలో దుకాణాల నిర్మాణం పునః ప్రారంభం
గత ఏడాది ఆగస్టు 24న అడ్డుకోగా.. ఇలా పరదాలు కప్పేసి వదిలేశారు.
విజయవాడ, న్యూస్టుడే: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నానుడి. కానీ ఇపుడు ‘రాజు’ గారు తలుచుకుంటే అసాధ్యం... సుసాధ్యం అవుతుందంటున్నారు మధురానగర్ వాసులు. నాడు వద్దన్నది నేడు ముద్దు అవుతుందని మధురానగర్ పై వంతెన పక్కన పునఃప్రారంభమైన దుకాణాల నిర్మాణాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగర వాసులకు వరుసగా హామీలు గుప్పిస్తున్న ఓ ప్రజాప్రతినిధి.. నిర్మాణదారులకు నువ్వు కట్టేయ్... అంతా నేచూసుకుంటా అంటూ అడ్డగోలు హామీ ఇచ్చినట్లు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గత ఏడాది ఆగస్టు 25న కూల్చివేసిన దుకాణాల సముదాయాన్ని.. మళ్లీ రాత్రికి రాత్రే కడుతున్నారు. మధురానగర్ పై వంతెన పక్కన అనుమతి లేకుండా నిర్మిస్తున్న దుకాణాల తంతు చూద్దామా..
మధురానగర్ పైవంతెన పక్కన సర్వీసురోడ్డులో 7 దుకాణాలను గత ఏడాది ఆగస్టులో నిర్మించారు. ఇరుకు దారిలో అనుమతి లేకుండా కడుతున్న దుకాణాలతో వచ్చే ఇబ్బందులను తెలియజేస్తూ ‘ఈనాడు’ గత ఏడాది ఆగస్టు 25న ‘ఇరుకు దారిలో... అనుమతి లేని నిర్మాణాలు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అప్పట్లో పట్టణ ప్రణాళికాధికారులు స్పందించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అదే రోజు అనుమతి లేకుండా నిర్మిస్తున్న దుకాణాల గోడలను కూల్చి వేశారు. రేకులను కొంత మేర తొలగించారు. తామే స్వచ్ఛందంగా తొలగించుకుంటామంటూ నిర్మాణదారులు కోరడంతో ఊరుకున్నారు. అప్పటి నుంచి నిర్మాణం చేయకుండా ఊరుకున్నారు.
ఇప్పుడు షట్టర్లు పెట్టి గోడలు కడుతున్నారిలా...
రాత్రికి రాత్రే వెలిసిన షట్టర్లు
దాదాపు 7 నెలలు ఊరుకున్న నిర్మాణదారులు తాజాగా నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జిని కలిసినట్లు సమాచారం. స్థానిక వైకాపా నేత.. నిర్మాణదారులను సదరు కొత్త ఇన్ఛార్జికి పరిచయం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన.. అంతా నే చూసుకుంటా అంటూ హామీ ఇవ్వడంతో రాత్రికి రాత్రే షట్టర్లు నిర్మించారు. శనివారం ఉదయం దుకాణాల గోడలను నిర్మించడం ప్రారంభించారు. స్థానికులు నిర్మాణం జరుగుతున్న తీరును చూసి అంతా ‘వెలంపల్లి హామీ’ మహత్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు
పై వంతెన పక్కన రెండు సర్వీసు రోడ్లు ఉన్నాయి. పెట్రోల్ బంక్ వైపు సర్వీసు రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక కారు ఎదురు వస్తే తప్పుకొనేందుకు వీలుండదు. అందుకే కార్లు పైవంతెనకు రెండో వైపు ఉన్న సర్వీసు రోడ్డులో వెళుతూ, వస్తూ ఉంటాయి. ఇపుడు ఆ రోడ్డులోనే 7 దుకాణాలను వరుసగా నిర్మిస్తున్నారు. రేపు ఆ దుకాణాలకు వచ్చే వారు వాహనాలను రోడ్డు మీద పెడితే.. రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు అంటున్నారు. అందుకే వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
తెలియదు... పరిశీలిస్తా
అనుమతి లేకుండా దుకాణాలు నిర్మిస్తున్నట్లు స్థానిక బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తాను కొత్తగా వచ్చానని దుకాణాల నిర్మాణం గురించి తెలియదని చెప్పారు. వాటిని పరిశీలిస్తానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు