Vijayawada: దుర్గగుడిలో టికెట్ల మాఫియా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శన టికెట్లు రీసైక్లింగ్ చేస్తూ అమ్మవారి ఆదాయానికి భారీగా కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు.
రూ. 500 టికెట్ల రీసైక్లింగ్
వైకాపా నేతల అండతో రెచ్చిపోతున్న కొందరు ఉద్యోగులు
ఇటీవల దుర్గగుడి దర్శనానికి వచ్చి అధికారులతో
గొడవ పడి వెళ్లిపోతున్న పాలకమండలి సభ్యురాలి భర్త
విజయవాడ వన్టౌన్, న్యూస్టుడే: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శన టికెట్లు రీసైక్లింగ్ చేస్తూ అమ్మవారి ఆదాయానికి భారీగా కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు. అధికార పార్టీ వైకాపా నేతల అండదండలతో కొందరు ఉద్యోగులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైకాపా ప్రజా ప్రతినిధులు-దుర్గగుడి పాలకమండలికి సంబంధించిన అనుచరులు, బంధువులు యథేచ్ఛగా అంతరాలయ దర్శనాలు చేసుకుంటున్నారు. దీని కోసం పాత టికెట్లను మళ్లీ.. మళ్లీ వినియోగిస్తున్నారు. దుర్గగుడిలో ఐదేళ్లుగా ఈ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. పరిస్థితి చేయదాటిన తరువాత ఎట్టకేలకు తాజాగా ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దుర్గగుడికి రెండు రోజుల కిందట వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువులు కొంత మంది దర్శనానికి వచ్చారు. వారిని రూ.500 టికెట్లు స్కానింగ్ చేసే ప్రాంతం వద్ద సిబ్బంది ఆపారు. దీంతో తాము ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువులమంటూ గొడవకు దిగారు. అనంతరం వారు ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈవో వచ్చి దర్శనం చేసుకుంటున్న భక్తుల సంఖ్య, టికెట్ల సంఖ్యను బేరీజు వేసి చూస్తే తేడా ఉన్నట్లు తేలింది. పాత టికెట్లనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టికెట్లు చించే వ్యక్తిని, స్కానింగ్ వద్ద ఉన్న వ్యక్తిని ఒక రోజు విధులకు రాకుండా ఆపేశారు. ఆ మరుసటి రోజు వైకాపా నాయకుల జోక్యంతో వారిద్దరికీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి దుర్గగుడి ప్రసాదాల కౌంటర్లో విధులు కేటాయించారు. స్థానికంగా ఉన్నటువంటి కొంత మంది వైకాపా నేతల అండదండలతో టికెట్ల పునర్వినియోగం జరుగుతుండగా బయట నుంచి దర్శనానికి వచ్చిన మరో వైకాపా ప్రజాప్రతినిధి బంధువులు అనుకోకుండా చేసిన ఫిర్యాదుతోనే ఈ అక్రమం వెలుగు చూడటం కొసమెరుపు.
అడ్డదారిలో దర్శనాలు.. ఆపై బెదిరింపులు
దుర్గగుడికి తాజాగా ఒక పాలకమండలి సభ్యురాలి భర్త దర్శనానికి వచ్చారు. దర్జాగా అంతరాలయ దర్శనం చేసుకున్న అనంతరం మండపంలో ఆశీర్వచనం అందుకున్నారు. అది కూడా చాలదని వీఐపీల మాదిరిగా ఆలయ గౌరవ మర్యాదలతో తనకు దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి అక్కడున్న ఏఈవో అంగీకరించకలేదు. పాలకమండలి సభ్యురాలొస్తే మర్యాదలు కల్పిస్తామని, మిగతా వారికి ఏ విధంగా కల్పిస్తామని ప్రశ్నించారు. దీనికి నిబంధనలు అంగీకరించవని తేల్చి చెప్పారు. పాలకమండలి సభ్యురాలి భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీ అంతు చూస్తానంటూ సదరు అధికారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్