ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం : బొండా
మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ రెక్కలు విరిగి, ముక్కలవుతుందని తెదేపా, జనసేన, భాజపా కూటమి మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఉమామహేశ్వరరావు
మొగల్రాజపురం (చుట్టుగుంట), న్యూస్టుడే : మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ రెక్కలు విరిగి, ముక్కలవుతుందని తెదేపా, జనసేన, భాజపా కూటమి మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. మరో 45 రోజుల్లో పూర్తి స్వేచ్ఛ వస్తుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అయిదేళ్ల విధ్వంసక, విద్వేష పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 28 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీలకు చెందిన 11 పథకాలను రద్దు చేసి.. వందలాది మందిపై మారణహోమం సృష్టించారని పేర్కొన్నారు. జగన్ పాలనకు ముగింపు పలికే సమయం శనివారంతో మొదలైందన్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో బైబై జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారని పేర్కొన్నారు. అన్నకు ఓటు వేయవద్దని సొంత చెల్లెళ్లే కోరుతున్నారని, ఇంతకంటే చెంపదెబ్బ ఏం ఉంటుందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే కాదు.. ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే ‘ప్రజాగళం’ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఉమా కోరారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకు బండిపై.. పెట్రో మంట!
[ 10-05-2024]
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట -
గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. -
కూటమితోనే అభివృద్ధి
[ 10-05-2024]
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
[ 10-05-2024]
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా అధికారులకు సూచించారు. -
చేష్టలుడిగిన నేత
[ 10-05-2024]
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం -
ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 10-05-2024]
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. -
కూటమికే మా మద్దతు
[ 10-05-2024]
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ ఆంజనేయులు అన్నారు. -
కూటమిదే పీఠం
[ 10-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు
[ 10-05-2024]
మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు ప్రారంభించారు. -
అమరావతి కోసమే పశ్చిమ సీటు ఇచ్చేనా..
[ 10-05-2024]
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. -
సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
[ 10-05-2024]
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు