AP Volunteers: మీకో దండం.. మీతో ఉండం
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు.
వైకాపా అభ్యర్థుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాలు
బందరులో నెలలోపే వైదొలగిన 12 మంది వాలంటీర్లు
ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్, మచిలీపట్నం
మచిలీపట్నంలో ఇటీవల కిట్టు ప్రచారంలో పాల్గొని వేటుకు గురైన వాలంటీర్లు
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. వీరందరూ ఎన్నికల నేపథ్యంలో వైకాపా నాయకుల ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తిగత కారణాలను చూపిస్తూ.. రాజీనామాలు సమర్పించారు.
వీరి బాటలోనే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చాలామంది వాలంటీర్లు రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నిత్యం తమతో ప్రచారానికి రావాలనీ, జనాన్ని తేవాలని వైకాపా నేతలు తెస్తున్న ఒత్తిడి భరించలేకే.. వాలంటీర్లు కొలువులు వదిలి వెళ్లిపోతున్నారు. కోడ్ అమలుతో ఇప్పటికే గన్నవరం, మచిలీపట్నం, తిరువూరు సహా పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లపై వేటు పడింది. ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు.. కేసులు సైతం నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో వాలంటీర్లు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కొలువులో ఉంటే వైకాపా అభ్యర్థుల ఒత్తిడి ఎక్కువైపోతోంది.. వారితో వెళితే అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. ఒకవేళ కేసులు నమోదైతే.. ఇక జీవితంలో ఏ కొలువుకూ పనికి రాకుండాపోతారు. ఈ తలనొప్పులు ఎందుకని చాలామంది వదిలేసి వెళ్లిపోతున్నారు.
విస్సన్నపేటలో ఇటీవల వైకాపా ప్రచారంలో వాలంటీర్లు
వాలంటీర్లను పావులుగా వాడుకుని మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం జగన్ మొదలు వైకాపా అభ్యర్థుల వరకూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. నియోజకవర్గాల్లో ఏ సమావేశం జరిగినా, విందు, వినోదాలు నిర్వహించినా.. కొన్ని నెలలుగా వాలంటీర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ‘మనమంతా ఒకటే.. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే.. అది మీపైనే ఆధారపడి ఉంది. ఇంటింటికీ వెళ్లి.. జగనన్న రాకపోతే.. పింఛన్లు ఆగిపోతాయని తప్పుడు ప్రచారం చేయండి. ప్రతిపక్ష అభ్యర్థులపైనా విష ప్రచారం చేయండని’.. వాలంటీర్లకు సమావేశాలు పెట్టి మరీ వైకాపా అభ్యర్థులు కొన్నాళ్లుగా నూరి పోస్తున్నారు. దీని ప్రభావంతో.. వాలంటీర్లు కూడా ఇంటింటికీ వెళ్లి.. ఇదే చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి మారింది. కోడ్ అమలుతో వాలంటీర్ల మెడపై కత్తి వేలాడుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న, వైకాపా అభ్యర్థులతో కలిసి తిరిగే వారిపై.. వేటు వేస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇప్పటికే చాలామంది వాలంటీర్లపై వేటు పడింది. ప్రస్తుతం కేసులు పెట్టేందుకూ సిద్ధమవుతున్నారు. కేసులు నమోదైతే భవిష్యత్తులో కొలువులు, ఉద్యోగ అవకాశాలు రావని తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. అందుకే.. ఎట్టిపరిస్థితుల్లోనూ వైకాపా అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయొద్దని వాలంటీర్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారు.
తాయిలాల్లోనూ పెద్దపీట..
ఉమ్మడి జిల్లాలో 22 వేల మంది వాలంటీర్లు.. ఒక్కో నియోజకవర్గంలో 1,300-1,500 మంది ఉన్నారు. వీరితో వైకాపా అభ్యర్థులు ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు పెట్టారు. వైకాపాను గెలుపునకు ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలో హితబోధ చేశారు. సమావేశం ముగిశాక విందు భోజనాలు పెట్టి, చేతిలో కుక్కర్లు, మిక్సీలు, చీరలు, దుస్తులు, స్మార్ట్వాచ్లు పెట్టారు. వాటితోనే ఓ చిన్న కవరులో రూ.2-5 వేలు చొప్పున ఒక్కోచోట ఒక్కో మాదిరిగా నగదు అందజేశారు. మొదట్లో దర్జాగా ఈ తాయిలాలు పంచారు. పెనమలూరులో మంత్రి జోగి తాయిలాల పంపిణీ వివాదంగా మారడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లడంతో.. ఆపై గుట్టుగా వాలంటీర్ల ఇళ్లకే అందించారు. కోడ్ వచ్చేంత వరకూ ఇవన్నీ దర్జాగా సాగాయి. కోడ్ వచ్చాక.. వైకాపా అభ్యర్థులతో వాలంటీర్లు కనిపించడం, ఇంటింటికీ వెళ్లి ప్రతిపక్షాలపై విష ప్రచారం చేసే వారిపై వేటు పడడంతో.. వారిలో భయం మొదలైంది.
బయటకు వెళ్లొద్దంటున్న తల్లిదండ్రులు..
‘కష్టపడి బీటెక్ చదివిస్తే.. వాలంటీరుగా చేరారు. నెలంతా గొడ్డు చాకిరీ చేస్తే రూ.5 వేలు ఇస్తున్నారు. మూడు నెలలుగా వైకాపా అభ్యర్థులు ప్రచారంలో వాడుకుంటున్నారు. కోడ్ వచ్చినా.. వెంట తిరగాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రచారానికి వెళ్తే కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేసులు నమోదైతే వీళ్ల జీవితమే నాశనమైపోతుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కూడా రావు. ఏమైనా సరే.. ఇల్లు దాటి వెళ్లొద్దని మా పిల్లలకు చెప్పాం. అవసరమైతే కొలువు వదిలేయమన్నామని’ ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ చదివి వాలంటీర్లుగా చేరిన పలువురి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా మహిళా వాలంటీర్లను బయటకు పంపేందుకు చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్