నమ్మించి.. వంచన
ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బకాయిల కోసం ఉద్యోగుల ఎదురు చూపులు
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్టుడే
బందరు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చౌక్లో ఆందోళన
ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు చెల్లించకపోగా ఆ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకోవడం పట్ల ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఆరునెలల నుంచి ఏడాది కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది. పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, ఇంటి నిర్మాణాలకోసం జీపీఎఫ్ రుణం కోసం దరఖాస్తు చేసుకుని సకాలంలో అందక, బయట అప్పులు చేసి వడ్డీలు చెల్లించలేక అనేక అవస్థలు పడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛను దారులకు రావాల్సిన వివిధ బకాయిలు రూ.25వేలకోట్లు ఉండగా జిల్లాలో దాదాపు 15వేలమందికి పైగా రూ.వెయ్యి కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు ఉద్యోగ వర్గాల అంచనా. బకాయిలపై తరుచూ ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోగా కక్ష కట్టినట్లు వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యనిధి ఖాతాకు వడ్డీ జమచేయకపోవడంతో నిల్వలు తగ్గిపోతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
అప్పులు చేయాల్సివచ్చింది..
- బి.మాణిక్యాలరావు, ఏటీపీఎఫ్ నాయకుడు
గతంలో ఎన్నడూ లేని విధంగా బకాయిలు రూ.వేల కోట్లల్లో పేరుకుపోయాయి. ఓ ఉద్యోగి తన కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆరునెలలకు గాని రుణానికి సంబంధించి నిధులు జమ కాలేదు. అవసరానికి రుణం నిధులు జమకాకపోవడంతో చేసేది లేక బయట వ్యాపారుల వద్ద అప్పుతెచ్చుకోవాల్సి వచ్చింది. సరెండర్లీవుల బకాయిల కోసం ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాం.
ఎప్పుడూ ఇలా లేదు
- వీరంకి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘ నాయకుడు
జిల్లా పరిషత్ పీఎఫ్ బకాయిలు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయి.ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆరునెలలైనా ఇంతవరకు పీఎఫ్ చివరి చెల్లింపులు ఇవ్వడం లేదు. ఉన్నత పాఠశాలలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పీజీటీలకు ఇంక్రిమెంట్ చేసుకోవడానికి ఏడాది తరువాత అవకాశం కల్పించారు. అవి ఇప్పటికీ ఖాతాలకు జమకాలేదు. ఇలా ఉద్యోగ, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నెలల తరబడి ఎదురుచూపులే..
- కొప్పినీడి సూర్యప్రకాష్, యూటీఎఫ్ జిల్లా నాయకుడు
ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉద్యోగి తనకు రావాల్సిన భవిష్యనిధికి సంబంధించిన డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి గతంలో లేదు. బ్యాంకు ఖాతా చూసుకోవడం నిరాశ చెందడం పరిపాటిగా మారింది. బకాయిలు విడుదల చేయాలంటూ రోడ్లెక్కి నిరసనల రూపంలో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే అవసరాలకు వినియోగించుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం