logo

గుంతల దారిలో వెళ్లేదెలా?

పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి బెంగళూరు రోడ్డులో మోకాలులోతు గుంతలు పడినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీఎస్పీ నాయకుడు శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు శుక్రవారం నిరసన తెలియజేశారు.

Updated : 26 Nov 2022 05:09 IST

నాట్లు వేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళలు, నాయకులు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి బెంగళూరు రోడ్డులో మోకాలులోతు గుంతలు పడినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీఎస్పీ నాయకుడు శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు శుక్రవారం నిరసన తెలియజేశారు. రహదారి గుంతల్లో వరినాట్లు వేశారు. వేలాదిమంది ప్రయాణించే రహదారి పూర్తిగా గుంతలమయమైనా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం మరమ్మతులైనా చేయాలని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని