పదోన్నతులు, బదిలీలు లేనట్టే!
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులు కల్పించకుండా సర్దుబాటు చర్యలు చేపట్టింది.
ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు
పుట్టపర్తి గ్రామీణం, అనంత విద్య, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులు కల్పించకుండా సర్దుబాటు చర్యలు చేపట్టింది. అవసరమైన పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే పదోన్నతులు వచ్చిన వారు, మిగులుగా తేలిన వారు చాలాచోట్ల పాత పాఠశాలల్లోనే పని చేస్తున్నారు. వీరిని కొత్త స్థానాలకు పంపనున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున ఈ ఏడాది బదిలీలను వాయిదా వేసినట్లు తెలిసింది. డిసెంబరు 3వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
జిల్లాలో ఎక్కడికైనా..
సర్దుబాటు కింద ఉపాధ్యాయులను జిల్లాలో ఎక్కడ్నుంచి ఎక్కడికైనా మండలం, డివిజన్ అనే నిబంధనలతో సంబంధం లేకుండా నియమించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి ఉన్న పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండేలా స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేస్తారు. 3, 4, 5 తరగతులు మ్యాప్ చేయబడిన ఉన్నత పాఠశాలలకు ఎస్ఏలను డిప్యూట్ చేయడంతోపాటు మిగులుగా ఉన్న ఎస్జీటీలను 3, 4, 5 తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్లను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.
430 మందిపై ప్రభావం
ఉమ్మడి జిల్లాలో పదోన్నతులు, బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు, అక్టోబరులో జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. మొత్తం 430 మంది దాకా హెచ్ఎంలు, ఎస్ఏలు పదోన్నతులు పొందారు. వీరంతా పదోన్నతులు, బదిలీ ఉత్తర్వులు వస్తాయని ఎదురుచూశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఉసూరుమన్నారు. జిల్లాలో 42 మంది హెచ్ఎంలు, ఎస్ఏలు ఉర్దూ 30, హిందీ 45, ఆంగ్లం 130, గణితం 36, ఉర్దూ గణితం 6, ఉర్దూ పీఎస్ 6, ఎన్ఎస్ 4, సోసియల్ స్టడీస్ 12, ఎస్ఏ పీడీ 113 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే వారికి అధికారికంగా ఉత్తర్వులు అందలేదు.
ఉత్తర్వుల మేరకే..
మీనాక్షి, డీఈవో, శ్రీసత్యసాయి జిల్లా
జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లా అధికారులతో చర్చించి ప్రక్రియ పూర్తి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?