బంగారు నాణేల పేరుతో కుచ్చుటోపీ
బంగారు నాణేలు ఎర చూపి నకిలీ నాణేలు అంటగట్టి కుచ్చుటోపీ పెట్టిన వైనం శనివారం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది.
నకిలీ బంగారు నాణేలు
పెద్దవడుగూరు, న్యూస్టుడే : బంగారు నాణేలు ఎర చూపి నకిలీ నాణేలు అంటగట్టి కుచ్చుటోపీ పెట్టిన వైనం శనివారం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్కు చెందిన దీపికకు సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన పేరు రాజు అని చెప్పి ఆమెతో సంభాషించేవాడు. మాటలు కలిపి తన వద్ద బంగారు నాణేలు ఉన్నాయని దీపికను నమ్మించాడు. ఆమెకు రెండు బంగారు నాణేలు పంపించారు. గత నెల 7న రెండు నాణేలను కర్ణాటక రాష్ట్రం హొసపేటెలోని బంగారు దుకాణంలో చూపించగా అవి బంగారు నాణాలే అని నిర్ధారించారు. దీంతో తమకు 200 నాణేలు కావాలని రాజుకు చెప్పారు. రూ.2లక్షలు ఖర్చవుతుందని నిందితుడు వారిని నమ్మించాడు. తక్కువ ధరలకు బంగారు వస్తుందని భావించిన వీరికి నిందితుడు నకిలీ నాణేలు అంటగట్టేందుకు నిత్యం దీపికను చరవాణిలో ఇబ్బంది పెట్టేవాడు. శనివారం కర్నూలు జిల్లాకు ఆమెను రమ్మన్నాడు దీంతో ఆమె కుమారుడు శివసుబ్రహ్మణ్యం, మరో వ్యక్తి రమేష్ కలిసి కారులో బయలుదేరారు. కర్నూలుకు వచ్చాక గుత్తికి రావాలని సూచించాడు. గుత్తికి వచ్చాక అనంతపురం రమ్మని చెప్పాడు. తాము ఎక్కడికీ రాలేమని చెప్పడంతో అనంతపురం సమీపంలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద తాను ఉన్నాను అక్కడికి రావాలని కోరాడు. వారు కళాశాల వద్దకు వచ్చారు. అంతలోనే రాజు మరో ఇద్దరు వ్యక్తులు దీపికను కలిసి నకిలీ నాణేలు అప్పగించి రూ.2లక్షలు నగదు తీసుకుని పరారయ్యారు. నాణేలను దీపిక గుత్తిలోని బంగారు దుకాణంలో పరీక్షించగా అవి నకిలీవని తేలింది. అవాక్కయిన వారు తాము మోసపోయామని భావించి పెద్దవడుగూరు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రాజశేఖరరెడ్డి చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎవరూ మోసపోవద్దు: బంగారు నాణేలు, ఆభరణాలంటూ ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు చరవాణిలో నమ్మించేందుకు ప్రయత్నిస్తే మోసపోవద్దని ఎస్సై రాజశేఖరరెడ్డి సూచించారు. వారి ప్రలోభాలకు గురికావద్దన్నారు.
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
[ 08-05-2024]
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఉక్కపోతకు ఉపశమనం
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
అనంత రైతులకు జగన్ నవమోసాలు
[ 08-05-2024]
రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు. -
‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’
[ 08-05-2024]
గుత్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఇస్మాయిల్ ఓటర్లను చైతన్యం పరుస్తున్నారు. గుంతకల్లులోని భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
అధికార పార్టీ సేవలో దుర్గం పోలీసు అధికారి
[ 08-05-2024]
ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. -
నాడు బాదుడే బాదుడన్నాడు.. నేడు పన్నులు దండుకున్నాడు
[ 08-05-2024]
చంద్రబాబు పాలనలో ప్రజలపై పన్నులు బాదుడే బాదుడు అంటూ.. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నాటి తెదేపా ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక.. నిస్సిగ్గుగా ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపాడు. -
అనంతపురం అర్బన్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
[ 08-05-2024]
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టీవీవీ ప్రతాప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన విషయం విధితమే. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
నియోజకవర్గంలోని పలు కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మంగళవారం స్థానిక ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
కన్నుపడితే కబ్జానే
[ 08-05-2024]
రాయదుర్గంలో వైకాపా నాయకులు వంకలు, రిజర్వుడ్ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకొని ఆక్రమించేస్తున్నారు. -
వీఆర్కు కానిస్టేబుల్
[ 08-05-2024]
కళ్యాణదుర్గంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచిన కానిస్టేబుల్ శివను పోలీసు అధికారులు వీఆర్కు పంపారు. -
నోట్లతో ఎర.. వినకుంటే బెదిరింపు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల వద్ద వైకాపా నాయకులు మోహరించి బేరసారాలు సాగించారు. మండుటెండల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 08-05-2024]
‘రానున్న కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కూటమి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్