కలహించుకుని.. కడతేర్చుకుని!
క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. పలువురు ఆవేశపూరిత నిర్ణయాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
చిన్నపాటి సమస్యలకే ఊపిరి తీసుకుంటున్న వైనం
అనంత నేరవార్తలు, కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్టుడే : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. పలువురు ఆవేశపూరిత నిర్ణయాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సభ్యుల చిన్నపాటి మనస్పర్థలు విలువైన ప్రాణాలను తీస్తున్నాయి. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే వాటికి పరుష పదజాలంతో, కించపరుచుకునే విధంగా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఎవరూ తగ్గకపోవడం.. మనస్తాపానికి గురై దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. వేరు కాపురాలు పెట్టడంతో కలహాలు తలెత్తినపుడు మంచీచెడూ చెప్పేవారు కరవయ్యారు.
పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి: కలహాలకు కారణాలు ఏవైనా చివరగా తీవ్రంగా నష్టపోయేది, ఒంటరిగా మిగిలిపోయేది పిల్లలే. వారి భవిష్యత్తు అంధకారం అవుతోంది. తాము దూరమైతే పిల్లలు ఎలా బతుకుతారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అనంత నగరంలోని ఆర్కేనగర్కు చెందిన బాలశంకరయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వ్యాపారం, కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు చేశాడు. ఈ విషయంగా కుటుంబంలో గొడవ జరిగింది. గత నెల 19న ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. ఐదు రోజుల తర్వాత గార్లదిన్నె సమీపంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
నగర పరిధిలోని సిండికేట్ నగర్లో సుంకన్న కుటుంబం వ్యాపారం చేస్తుంది. కుమారులు ఇద్దరూ చూసుకునే వారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి తండ్రి.. చిన్నకుమారుడు హరిబాబును మందలించడంతో ఇంటి పక్కనే షెడ్డులో ఉరేసుకున్నాడు.
అనంత గ్రామీణం కొడిమికి చెందిన స్వర్ణ నెల క్రితం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. అనార్యోగం, తమ్ముడు జీవితంలో స్థిరపడలేదని తరచూ బాధపడుతుండేది. ఈక్రమంలో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది.
ఈ చిత్రంలోని చిన్నారి పేరు చరణ్(4). అమ్మమ్మ లక్ష్మిదేవి వద్ద పెరుగుతున్నాడు. కళ్యాణదుర్గం పట్టణంలోని మారంపల్లి కాలనీలో నివాసముంటున్న లక్ష్మిదేవి కూతురు చిట్టెమ్మకు మహేష్తో వివాహమైంది. వీరి కుమారుడే చరణ్. దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన చిట్టెమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణంతో తండ్రి బాధ్యతలు తీసుకోకపోవడంతో ఒంటరైన చిన్నారి అమ్మమ్మ కూలి పనులకెళ్లి మనువడికి అన్నీ తానై చూసుకుంటోంది.
ఐదు నెలల్లో 25 మంది..
అనంత జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 25 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో పురుషులు 11 మంది కాగా, మహిళలు 14 మంది. వారిలో భార్యాభర్తలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
మార్గదర్శనం అవసరం..
ఇటీవల నమోదవుతున్న కేసుల్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటున్నాయి. కూర్చుని సామరస్యపూర్వకంగా మాట్లాడుకుంటే చాలా వరకు పరిష్కారం అవుతాయి. గొడవ పడినపుడు వారికి సాంత్వన, మార్గదర్శనం అవసరం. మా దగ్గరికి వచ్చే వారికి మూడు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. చాలా మంది మనస్పర్ధలు వీడి కలిసిపోతున్నారు.
చిన్నగోవిందు, సీఐ, దిశ పోలీస్స్టేషన్, అనంతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్