logo

సీఎం సభకు బస్సులు.. ప్రయాణికుల పాట్లు

సీఎం జగన్‌ ఇతర జిల్లాల్లోని ఎన్నికల పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం డిపో నుంచి 26 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 28 Mar 2024 05:00 IST

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ఇతర జిల్లాల్లోని ఎన్నికల పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం డిపో నుంచి 26 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి 14, బుధవారం ఉదయం 12 బస్సులు వెళ్లాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కొన్ని మార్గాల్లో ఒకటి, రెండు సర్వీసులు ఉండగా, మరి కొన్ని మార్గాల్లో సర్వీసులు లేక పోయాయి. చాలా మంది ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడి అధిక ఛార్జీలు వెచ్చించి వెళ్లాల్సి వస్తోందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్టీసీ డీఎం రామచంద్రను వివరణ కోరగా ఎన్నికల కోడ్‌ ఉన్నందున బస్సులను అద్దెకు పంపుతున్నామని, దాని వల్ల పలు గ్రామాలకు సర్వీసులు లేవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని