ధర్మవరంలో కూటమి జోరు
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
ఈనాడు డిజిటల్, పుట్టపర్తి: ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ బరిలో నిలిచారు. తెదేపా ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పూర్తి మద్దతు ప్రకటించడంతోపాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. దశాబ్దాల తర్వాత బీసీకి టికెట్ కేటాయించడం పట్ల ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వైకాపాలో కీలకంగా ఉన్న బీసీ నాయకులు సైతం రాజీనామా చేసి సత్యకుమార్కు మద్దతు తెలుపుతున్నారు. వైకాపాకు పట్టున్న గ్రామాల్లోనూ పరిస్థితి మారుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
వ్యాపారుల్లో సానుకూలత
నియోజకవర్గంలో మొత్తం 2.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ధర్మవరం పట్టణంలోనే 1.10 లక్షల ఓట్లు ఉన్నాయి. చేనేత కార్మికులు, వ్యాపారుల ఓట్లే అత్యధికం. ఐదేళ్ల వైకాపా పాలనలో ధర్మవరంలోని వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆదాయం పడిపోయి ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన అనుచరుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా సాగింది. వ్యాపారులపై దాడులకు తెగపడ్డ సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయా వర్గాల్లో అభద్రతాభావం నెలకొంది. సత్యకుమార్ అభ్యర్థిగా రావడంతో వ్యాపారుల్లో ఆశలు చిగురించాయి. కూటమి అభ్యర్థి గెలిస్తే దాడులు, దౌర్జన్యాలకు తెరపడుతుందనే భావనలో వ్యాపారులు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైకాపా గాలిలోనూ తెదేపాకు పట్టణంలో 6 వేల వరకు మెజారిటీ లభించింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అవినీతి, అరాచకాలను ఎండగడుతూ...
సభలు, సమావేశాల్లో వైకాపా అరాచకాలు, అవినీతిని సత్యకుమార్ ఎండగడుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ఎలా పక్కదారి పట్టించారో వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేయాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెబుతున్నారు. స్థానికేతరుడిని అయినప్పటికీ ప్రతి గ్రామంపై అధ్యయనం చేస్తున్నామని... సమస్యలను ఆరా తీసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను చేతికిస్తారా ప్రాణాలు తీస్తారా?
[ 30-04-2024]
సామాజిక పింఛను సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్న పండుటాకులకు చెడు జరిగితేనే ఎన్నికల్లో తన పార్టీకి మంచి జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. -
గ్రామంలో ఎలా తిరుగుతావో చూస్తా..
[ 30-04-2024]
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు అంతులేకుండా పోతోంది. -
తుది పోరుకు సై
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది. -
శవాగారాల్లోనూ దోపిడీ
[ 30-04-2024]
అనంత సర్వజనాసుపత్రిలో అనాథ, గుర్తుతెలియని మృతదేహాలను నిలవ చేయడం గగనంగా మారుతోంది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఈ దుస్థితి దాపురించింది. -
కొండలు, గుట్టల దోపిడీ.. జగనెరిగిన సత్యం
[ 30-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నాయకులకు ప్రకృతి వనరులు ఆదాయ మార్గాలుగా మారాయి. నాడు కొండలను చూస్తే వామ్మో కొండలు అనేవారు -
ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం
[ 30-04-2024]
పార్టీలకు కార్యకర్తలు, నాయకులే బలం. వారు లేకపోతే పార్టీనే లేదు. ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించారా? గౌరవించి ఉంటే వైకాపాను వీడాల్సిన పనిలేదు. ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులను కూడా వేధిస్తున్నారు. -
అధికార పార్టీకి ఓటుతో బుద్ధి చెబుదాం
[ 30-04-2024]
అన్ని రంగాల్లో అభివృద్ధిని మరిచిన వైకాపా ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. -
వాలంటీరుకు దేహశుద్ధి
[ 30-04-2024]
మండలంలోని ఓ గ్రామంలో మాజీ మహిళా వాలంటీరును సెల్ఫోన్లో వేధించిన మరో వాలంటీరుకు సోమవారం బంధువులు, గ్రామస్థులు దేహశుద్ధి చేశారు -
అమృత్ను అటకెక్కించారు
[ 30-04-2024]
పెనకచర్ల డ్యామ్ నుంచి పామిడి మండలానికి నీరు రప్పించడం ద్వారా తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్న ఆలోచనతో అమృత్ పథకం కింద తెదేపా హయాంలో చేపట్టిన పనులు అటకెక్కాయి. -
వైకాపాలో బీసీలకు అన్యాయం.. కూటమికే మద్దతిస్తాం
[ 30-04-2024]
జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ
[ 30-04-2024]
మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం గుణేమోరుబాగుల్, మోరుబాగుల్ తాళికేర, ముతుకూరు, సీసీగిరి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎం.ఎస్.రాజు, గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఇంతవరకు అభివృద్ధి జరిగింది -
కళ్లు మూసుకున్న పాలకులకు కల్వర్టు కష్టాలేం తెలుస్తాయ్..
[ 30-04-2024]
వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన బాగుచేస్తే వందలాది మందికి ప్రయోజనం. అయినా వైకాపా ప్రభుత్వానికి కనీస పట్టింపులేదు. -
వైకాపా ఎమ్మెల్యే సోదరుడికి చేదు అనుభవం
[ 30-04-2024]
బుక్కపట్నం మండలంలోని బుచ్చయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మకు మూడేళ్ల కిందట జగనన్న గృహం మంజూరైంది. మంజూరు పత్రం సైతం అందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్