కొండలు, గుట్టల దోపిడీ.. జగనెరిగిన సత్యం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నాయకులకు ప్రకృతి వనరులు ఆదాయ మార్గాలుగా మారాయి. నాడు కొండలను చూస్తే వామ్మో కొండలు అనేవారు
వైకాపా నాయకుల ఆదాయ మార్గాలుగా ప్రకృతి వనరులు
ఆగడాలపై నోరు మెదపని ముఖ్యమంత్రి
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నాయకులకు ప్రకృతి వనరులు ఆదాయ మార్గాలుగా మారాయి. నాడు కొండలను చూస్తే వామ్మో కొండలు అనేవారు. నేడు పొక్లెయిన్లు పెట్టి యంత్రాల సాయంతో దోచేస్తున్నారు. మట్టి, రాళ్లను ట్రాక్టర్లలో తరలించి పట్టణాలు, మండల కేంద్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా ఈ ఐదేళ్లలో కొండలు, గుట్టలు భారీగా కరిగిపోయాయి. నాయకుల జేబుల్లో నిధులు చేరాయి. కొన్నిచోట్ల అనుమతి తీసుకున్నది కొంతైంతే.. దోచుకున్నది కొండంత ఉంటుంది. సంబంధితశాఖల ఉన్నతాధికారులు, పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండాపోయింది.
- న్యూస్టుడే బృందం
ఇళ్ల నిర్మాణానికి తరలించి..
ధర్మవరం పట్టణం: పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొండలు వైకాపా నాయకులకు రూ.కోట్లు కురిపించాయి. పోతులనాగేపల్లి వద్ద జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు నాయకులు కొండల్ని కరిగించి మట్టిని తవ్వి విక్రయించారు. కేతిరెడ్డికాలనీలోనూ ఇదే దందా కొనసాగుతోంది. అక్కడ నిర్మిస్తున్న ఇళ్లకు రేగాటిపల్లి సమీపంలోని కొండలను కరిగించేశారు.
కోడ్ అమలులోకి వచ్చినా..
పుట్టపర్తి: నల్లమాడ నుంచి కదిరికి వెళ్లే రహదారిలో ఎద్దులవారిపల్లి తండా వద్ద ఉన్న గుట్టల నుంచి మట్టిని యథేచ్ఛగా లేవుట్లు, వ్యవసాయ పొలాలు, ఇంటి నిర్మాణాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడు ట్రాక్టరు మట్టి రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా రాత్రి సమయంలో బరితెగించి తరలించేస్తున్నారు.
మట్టి తరలించి.. నిధులు మూటకట్టి
మామిళ్లపల్లిలో ఎర్రగుడ్డం కొండ తీరు..
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో ఉన్న ఎర్రగుడ్డం కొండ 45 ఎకరాలకు పైగానే ఉంటుంది. అందులో ఆరు ఎకరాల్లో కొండ చుట్టూ మట్టిని తొలిచిన వైకాపా నాయకులు బయటి ప్రాంతాల్లో విక్రయించి రూ.లక్షలు ఆర్జించారు. ఫలితంగా ప్రకృతి వనరులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఆదాయమే మార్గంగా..
ఎ.కొండాపురం వద్ద కొండమట్టి తరలింపు
పుట్లూరు: మండలంలోని ఎ.కొండాపురంలో సర్వేనంబరు 1లో సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో గాలిమరల ఉత్పత్తి కేంద్రాలు స్థాపించారు. మూడేళ్లుగా ఈ పరిసరాల్లోని మట్టిని స్థానిక వైకాపా నాయకుడొకరు ట్రిప్పు ట్రాక్టరు మట్టి రూ.300 చొప్పున అమ్ముకున్నాడు. తర్వాత యర్రగుంటపల్లికి చెందిన మరో నాయకుడు సచివాలయ నిర్మాణానికి అంటూ టిప్పర్లతో మట్టిని కొల్లగొట్టాడు.
ఇష్టారాజ్యంగా..
బొమ్మనహాళ్: వైకాపా ఐదేళ్ల పాలనలో నేమకల్లు కొండలు కరిగిపోతున్నాయి. ఈ కొండల్లో 23 కంకరమిషన్లు ఉండేవి. 2019లో అధికార పార్టీ నాయకుడి కుటుంబ సభ్యుల పేరుమీదనే క్వారీలకు అనుమతి ఇవ్వడంతో లక్షలాది క్యూబిక్ మీటర్ల మేర కొండలోని తెల్లరాయి తరలి వెళ్లింది. మోతాదుకు మించి మందుగుండు సామగ్రితో బ్లాస్టింగ్ చేస్తుండటంతో భారీ శబ్దానికి నేమకల్లు, ఉంతకల్లు గ్రామాల్లో ఇళ్లు సైతం చీలికలు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిరప రైతుపై శీతకన్ను
[ 20-05-2024]
మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
కాలువల నిండా పూడిక.. సాగు సాగేదెలా ఏలిక?
[ 20-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. -
కష్టాలు కనవయ్యా.. వీరభద్రా!
[ 20-05-2024]
లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. -
పతకం కల.. దక్కించుకునే పట్టుదల
[ 20-05-2024]
ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్ టెన్నిస్ రాకెట్ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్ టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్లో అడుగుపెట్టాడు. గేమ్ మొత్తం లాన్ టెన్నిస్ మాదిరిగానే ఉంటుంది. -
నేటి నుంచి పెన్నహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 20-05-2024]
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
[ 20-05-2024]
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
సిట్ దర్యాప్తుపై తొలగని ఉత్కంఠ
[ 20-05-2024]
తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. -
ఎస్కేయూలో హాస్టళ్ల మూసివేతపై రగడ
[ 20-05-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో నాన్బోర్డర్ల బెడదతో వివాదం నెలకొంది. వేసవి సెలవుల్లో కూడా మహానంది వసతి గృహం తెరచి ఉంచాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. -
కొడవలితో వైకాపా కార్యకర్త వీరంగం
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు. -
జాతీయస్థాయిలో అనంతకు ఖ్యాతి
[ 20-05-2024]
మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
విద్యుదాఘాతానికి యువతి బలి
[ 20-05-2024]
విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్ చేయడానికి ప్రయత్నించింది. -
టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ
[ 20-05-2024]
ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
[ 20-05-2024]
ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు