గ్రామంలో ఎలా తిరుగుతావో చూస్తా..
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు అంతులేకుండా పోతోంది.
తెదేపాలో చేరిన వారిపై ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు
కనగానపల్లి, న్యూస్టుడే: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు అంతులేకుండా పోతోంది. అర్ధరాత్రి పూట వాహనాల్లో మందీ మార్బలాన్ని వెంట వేసుకొని వైకాపా నుంచి తెదేపాలో చేరిన వారిపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలు వరుసగా శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కనగానపల్లి మండలం వేపకుంట వైకాపా నాయకుడు తలారి పుల్లప్ప అతని బంధువులు, శ్రేయోభిలాసులతో కలిసి ఈ నెల 28న రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల సునీత సమక్షంలో తెదేపాలో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సోదరుడు చంద్రశేఖర్రెడ్డి తన అనుచరులతో మామిళ్లపల్లి అమరనాథ్రెడ్డి, గంగుల సుధీర్రెడ్డితోపాటు మరో 25 మందితో కలిసి 8 వాహనాల్లో వేపకుంటకు అర్ధరాత్రి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు శ్రీరాములు ఇంటిలో ఎమ్మెల్యే సోదరుడు కూర్చొని తలారి పుల్లప్పను పిల్చుకొని రావాలని అతని అనుచరులకు చెప్పాడు. ఇంటి బయట నిద్రిస్తున్న తలారి పుల్లప్పను పిల్చుకొని శ్రీరాముల ఇంటి వద్దకు వెళ్లారు. ఇన్ని రోజులు మా పార్టీలో తిరిగి ఇప్పుడు తెదేపాలో ఎలా చేరావు? అంటూ తలారి పుల్లప్పపై దుర్భాషలాడాడు. గ్రామంలో నీవు ఎలా తిరుగుతావో నేను చూస్తా.. మా అనుచరులతో వచ్చి నీవు, నీ బంధువులు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సమక్షంలో వైకాపా కండువా వేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడుతావు.. అంటూ బెదిరించి అక్కడ నుంచి వారు వెళ్లిపోయారు. ఈ నెల 27న రామగిరి మండలానికి చెందిన సంపత్ను, ఈనెల 28న తోపుదుర్తి గ్రామానికి చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన లింగమయ్య, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వన్నూరప్పలపై ఎమ్మెల్యే మరో సోదరుడు రాజశేఖర్రెడ్డి దాడి చేసి పార్టీ మారాలని బెదిరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం
[ 21-05-2024]
రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. -
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వేళాయె..
[ 21-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. -
మళ్లీ బాదుడు ..
[ 21-05-2024]
ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. -
పురం పారిశ్రామికవాడల్లో నీటికి కటకట
[ 21-05-2024]
శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్ హౌస్ వద్ద నీటిని పంపింగ్ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది. -
శాంతిభద్రతలు పర్యవేక్షించండి
[ 21-05-2024]
జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు పేర్కొన్నారు. -
పాతఏరులో కబ్జాదారుల పాగా
[ 21-05-2024]
హిందూపురంలోని పరిగి రోడ్లో ఉన్న పాతఏరులో ఆక్రమణదారులు తిష్ఠవేశారు. దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న ఈఏరు సగానిపైగా కబ్జాకు గురైంది. -
రెండేళ్లయినా సొంత భవనాల్లేవ్
[ 21-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటై 25 నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రమైన పుట్టపర్తి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా విడుదల చేసిన పాపానపోలేదు. -
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
[ 21-05-2024]
భాజపా జాతీయ కార్యదర్శి ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్ సోమవారం ధర్మవరం వచ్చారు. ఎన్డీయే ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ఆయనకు తెదేపా, భాజపా నాయకులు గజమాలలతో సత్కరించారు. -
ఏసీఎల్ తుదిపోరుకు ఇండియన్ సిక్సర్స్ జట్టు
[ 21-05-2024]
అనంత క్రికెట్ లీగ్ ఫైనల్కు ఇండియన్ సిక్సర్స్ జట్టు అర్హత సాధించింది. అనంత క్రీడాగ్రామంలో సోమవారం జరిగిన పోటీలో ఇండియన్ జట్టు ఫ్యామిలీ క్లబ్ జట్టును 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. -
శ్రీరామిరెడ్డి నీటిపథకం కార్మికుల సమ్మె బాట
[ 21-05-2024]
శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు -
ప్రభుత్వం విస్మరించింది.. ఆర్డీటీ నిర్మించింది
[ 21-05-2024]
శిథిలమైన చెక్డ్యామ్ను పునర్నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు. విసిగి వేసారిన వారు ఆర్డీటీ సంస్థను సంప్రదించారు. -
అనంతలో జోరు వాన
[ 21-05-2024]
జిల్లా కేంద్రం అనంత నగరంలో సోమవారం రాత్రి జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. -
తాడిపత్రి అల్లర్ల కేసులో 728 మంది నిందితులు
[ 21-05-2024]
పోలింగ్ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
-
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
-
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
-
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
-
డీజీపీ ఫొటోతో వాట్సప్ డీపీ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు
-
అరకు పర్యటకానికి కొత్తరూపు