logo

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు.

Published : 20 Apr 2024 03:38 IST

ప్రచారం నిర్వహిస్తున్న అమిలినేని సురేంద్రబాబు, నాయకులు

కళ్యాణదుర్గం గ్రామీణం: ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి, కళ్యాణదుర్గం పట్టణంలోని 16, 17 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని