వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది.
వలస వెళుతున్న కార్మికులు
జాబ్వర్క్ దుకాణాల మూత
దుస్తులు కుడుతున్న కార్మికులు
రాయదుర్గం, న్యూస్టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. ఇక్కడి నుంచి జీన్స్ దుస్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఒకప్పుడు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లిన పరిశ్రమ వైకాపా పాలనలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. 20 వేల మందికి ఉపాధి నిచ్చి.. రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ కలిగిన పరిశ్రమ కుదేలయ్యింది. జగన్ సర్కారు నూలు పోగంత సాయం కూడా చేయకపోవడంతో గార్మెంట్ యూనిట్లు మూత పడుతున్నాయి. ఒకవైపు షోరూమ్ల నుంచి ఆర్డర్లు రాక ఉత్పత్తులు గుట్టలుగా పేరుకుపోయాయి. విద్యుత్తు బిల్లులు షాక్ కొడుతుండటంతో నిర్వహణ భారమై చిన్నా చితకా యూనిట్లు మూతపడ్డాయి. స్థానికంగా పనులు లేక ఇప్పటికే వేలాది మంది కార్మికులు బెంగళూరు, చెన్నై, బళ్లారి, ముంబయి వంటి నగరాలకు వలస వెళ్లారు. సొంతూళ్లను వదులుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లలేని వారు కూలీలుగా, హోటళ్లు, కూరగాయల దుకాణాలు నడుపుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పథకంలో భాగంగా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను 45 రోజుల్లోగా పేమెంట్లు చేయాలనే నిబంధనలతో వ్యాపారులు సతమతమవుతున్నారు. షోరూమ్లు, బహుళ జాతి కంపెనీలకు అరువుగా సరఫరా చేసిన దుస్తుల పేమెంట్లు రాకపోవటంతో రుణాల చెల్లింపుల కోసం వ్యాపారులకు ఇబ్బందులు తప్పటం లేదు. గతంలో ఏడాదికోమారు జీఎస్టీ నిబంధనల్లో మార్పులు జరిగేవి. ప్రస్తుతం ప్రతి నెలా మార్పులు చేస్తుండటంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. అమెజాన్, ప్లిప్కార్ట్ లాంటి సంస్థల ఆన్లైన్ వ్యాపారాలతో కూడా గార్మెంట్స్ వ్యాపారం కుదేలైంది.
30 శాతం మాత్రమే దుస్తుల ఉత్పత్తి
రిటైల్ వ్యాపారాలు, ఆర్డర్లు లేక ప్రస్తుతం 30 శాతం మాత్రమే జీన్స్, కాటన్ దుస్తులను తయారు చేస్తున్నారు. పేమెంట్లు కూడా సకాలంలో రావటం లేదు. చిన్నా చితకా వ్యాపారులు కూడా బెంగళూరులో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొందరు నైపుణ్యం గల కార్మికులను వదులుకోలేక, పండగల సీజన్లపై ఆశతో కొంత మేర మాత్రమే దుస్తులు తయారు చేస్తున్నారు.
విద్యుత్తు రాయితీలేవీ?
తెదేపా ప్రభుత్వ హయాంలో గార్మెంట్స్ పరిశ్రమకు నిరంతర విద్యుత్తును సరఫరా చేసేవారు. మరో 20ఏళ్లపాటు పట్టణËంలో లోఓల్టేజీ నివారణకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. పట్టణానికి ఉప విద్యుత్తు కేంద్రం మంజూరైనా వైకాపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కాకపోవటం, విద్యుత్తు అవాంతరాలను సరిచేసేందుకు పట్టణమంతా సరఫరాను తొలగించటం, ప్రస్తుతం కోతలు అధికం కావటం, రాయితీలు లేకపోవటంతో దుస్తుల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.
ప్రభుత్వ ప్రోత్సాహం కరవు
గార్మెంట్స్ పరిశ్రమకు వైకాపా ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వటం లేదు. రాయదుర్గంలో గార్మెంట్స్ పరిశ్రమల మనుగడకు విద్యుత్తు రాయితీలు, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు, వస్త్రం, ముడి వస్తువులు, రంగుల ధరల తగ్గింపు లాంటి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం వస్త్ర సన్యాసం చేయటంతో కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు.
టంకశాల హనుమంతు, గార్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాయదుర్గం
నెల రోజులుగా పనుల్లేవు
కుటుంబాన్ని రాయదుర్గంలో వదిలి బెంగళూరుకు వలస వెళ్లాను. అక్కడ హోటళ్లలో భోజనాలు చేస్తూ, గార్మెంట్స్ యూనిట్లో నిద్రిస్తూ దుస్తులు కుడుతున్నా. రోజుకు రూ.500 సంపాదిస్తున్నా.
మల్లికార్జున, గార్మెంట్స్ కార్మికుడు, రాయదుర్గం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ విలువ రూ.4,080 కోట్లు
[ 02-05-2024]
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. బార్లు బార్లా తెరిచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
ఇస్తే సులభం.. కుట్ర చేస్తే కష్టం
[ 02-05-2024]
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం. -
ఈవీఎంలపై అపోహలు వద్దు
[ 02-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్వేర్తో తయారు చేసినట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్కుమార్, ఎన్నికల పరిశీలకులు అజయ్నాథ్ ఝు, మనీష్ సింగ్ తెలిపారు. -
కానుకలు ఎత్తివేత.. సరకుల్లో కోత
[ 02-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది. -
కొండను కొల్లగొట్టారు
[ 02-05-2024]
పామిడి మండలంలోని వంకరాజుకాలువ, నెమళ్లపల్లి గ్రామ కొండల్లో నుంచి ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. తాత్కాలిక అనుమతి పత్రాలు ఉన్నాయంటూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. రోజూ ఇరవై టిప్పర్ల వరకు మట్టిని తరలిస్తున్నారు. -
అధికార పక్షానికి పోలీసులు దాసోహం
[ 02-05-2024]
ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగపడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. దాడులపై ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు. -
ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి ఓటమి భయం : సునీత
[ 02-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఆయన సోదరులతో సొంత పార్టీ నాయకులనే బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారని, నియోజకవర్గంలో చాలాచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
తెదేపాతోనే మహిళల సంక్షేమం
[ 02-05-2024]
మహిళలు అభివృద్ధి పథాన నడవాలన్నా, వారు సంక్షేమాన్ని సమర్థంగా అందుకోవాలన్నా తెదేపాతోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
వైకాపా అరాచక పాలనను సాగనంపుదాం
[ 02-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. -
ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుదాం
[ 02-05-2024]
వైకాపా అవినీతి, అక్రమాల పాలనకు అంతం పలకాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని కెంచానపల్లి, జుంజురాంపల్లి, బీఎన్హళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. -
వైకాపా ప్రచారానికి వెళ్తున్న కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
[ 02-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రామ్భూపాల్ వివరాల మేరకు.. శెట్టూరు మండలం కనుకూరుకు చెందిన ఓబన్న, భార్య నాగమణి, కోడలు అనురాధ ద్విచక్ర వాహనంలో కళ్యాణదుర్గం వెళుతున్నారు. -
అనంతలో తెదేపా నాయకుడి అరెస్టు
[ 02-05-2024]
అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్పై దాడి చేయించాడనే కారణంతో వన్టౌన్ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు. -
తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ
[ 02-05-2024]
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ముస్లింల నమ్మకద్రోహి జగన్’
[ 02-05-2024]
రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు నమ్మించి మోసం చేసిన ఘనత జగన్దేనని శాసనమండలి మాజీ ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ ఆరోపించారు. బుధవారం నగరం అనంత కన్వెన్షన్ హాలులో ముస్లిం, మైనారిటీలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!