చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది.
వైకాపా పాలనలో సంరక్షణకు నానాతంటాలు
అనంతపురం మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలోని క్షేత్రంలో తొట్టెల్లో పెంచుతున్న చేపపిల్లలు
అనంతపురం(వ్యవసాయం), న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. నిరుడు వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీరు వదలకపోవడం, చెరువుల్లో నీరు లేకపోవడంతో చేపల పెంపకానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. కాలువల్లో నీరు ఆపడం, మత్స్యక్షేత్రాల్లో బోర్లు ఎండిపోవడంతో చేపపిల్లల్ని సంరక్షించేందుకు నానాతంటాలు పడుతున్నారు. క్షేత్రాల్లో గుడ్డు వదిలిన తర్వాత 90 రోజులు తర్వాత చేప పిల్లల్ని ప్రాజెక్టుల్లోను, చెరువుల్లోను వదలాలి. సుమారు 8 నెలలు కావస్తోంది. చేప పిల్లలు ఎదిగాయి. దాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. మత్స్య క్షేత్రాల్లోనే చేప పిల్లలు నిల్వ ఉంచాల్సిన పరిస్థితి. వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక మత్స్యశాఖ అధికారులు ఆవేదన చెందుతున్నారు.
- అనంతపురం జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో క్షేత్రం ఉంది. ఇది పూర్తిగా హెచ్చెల్సీ కాలువ నీటిపైనే ఆధారపడి ఉంది. కాలువ నీటికే చేప పిల్లలు త్వరగా ఎదుగుతాయి. ఈ ఏడాది ఒక్క నెల కూడా కాలువలో నీరు పారలేదు. బోరు నీటికి ఎదుగుదల ఉండదు. ఒక బోరు ఎండిపోయింది. రెండో బోరులో కొద్దిగా నీరు వస్తోంది. ఆ నీటితోనే తక్కువ చేప పిల్లలు ఉత్పత్తి చేపట్టామని అధికారులు తెలిపారు. 9.10 లక్షలు చేప పిల్లలు పెంచారు. అందులో 82-100 ఎంఎం పొడవున్న మృగాల రకం పిల్లలు 4 లక్షలు మాత్రమే శ్రీశైలం, వెలుగోడు ప్రాజెక్టులకు సరఫరా చేశారు. ఇంకా 700 ఎంఎం పొడవున్న చేపపిల్లలు 5.10 లక్షలు మిగిలి ఉన్నాయి.
- ఎంపీఆర్ ప్రాజెక్టు క్షేత్రంలో 13.50 లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేయగా, ఎంపీఆర్ డ్యాంలో 5 లక్షలు వదిలారు. 2 లక్షల చేప పిల్లలను కడప జిల్లాకు సరఫరా చేశారు. ఇంకా 6 లక్షల పిల్లలు మిగిలి ఉన్నాయి.
- పీఏబీఆర్లో 12 లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేశారు. 4 లక్షలు కడప జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టుకు సరఫరా చేశారు. 8 లక్షల పిల్లల నిల్వ మిగిలిపోయాయి.
- బైరవానితిప్ప ప్రాజెక్టులో 3.85 లక్షల చేప పిల్లలు ప్రాజెక్టులో వదిలారు. 6.40 లక్షల పిల్లలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులే.. అసురలై
[ 06-05-2024]
నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. -
ఉద్యోగులకు ప్రలోభాల ఎర
[ 06-05-2024]
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. -
ఎన్నికల ముందు హామీలు.. ఆనక నామాలు
[ 06-05-2024]
-
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అనంత అభివృద్ధి
[ 06-05-2024]
వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. -
గొడవలపై ఉక్కుపాదం మోపండి
[ 06-05-2024]
‘ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా పేర్కొన్నారు. -
తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు
[ 06-05-2024]
సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. -
వైకాపా వ్యతిరేక ఓటును ఆపేందుకు ప్రయత్నం
[ 06-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో.. స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. -
ఫాం-12 ఇచ్చాం.. మా పేర్లు ఏమయ్యాయి
[ 06-05-2024]
‘ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఫాం-12 సకాలంలో ఇచ్చాం. మేము పని చేసే చోటే ఆర్ఓలకు సమర్పించాం. ఇపుడు ఓటు వేసేందుకు వస్తే.. పేర్లు లేవంటారు. -
గుంతకల్లు భగభగ
[ 06-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?