logo

రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం

రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ మనోజ్‌ తెలిపారు.

Published : 24 Apr 2024 05:16 IST

జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి అవకాశం

గుంతకల్లు, న్యూస్‌టుడే : రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ మనోజ్‌ తెలిపారు. ఎకానమీ భోజనం ప్యాకెట్‌ రూ.20, భోజనంతో పాటు స్నాక్స్‌ రూ.50లతో ప్రయాణికులకు అందజేస్తున్నామన్నారు. డివిజన్‌లోని గుంతకల్లు, పాకాల, రేణిగుంట, తిరుపతి, డోన్‌, నంద్యాల రైల్వే స్టేషన్లలో భోజనం అమ్మకాలు చేపట్టామన్నారు. గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని 7వ నంబరు ప్లాట్‌ఫారంలో కౌంటరును ఏర్పాటు చేశామని తెలిపారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారి కోసం ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని