జానెడు రోడ్డేయలేని ఎమ్మెల్యే అవసరమా?: సునీత
వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
అనంతపురం (కళ్యాణదుర్గం రోడ్డు), రాప్తాడు, న్యూస్టుడే: వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో 85 కుటుంబాలు పార్టీలోకి చేరారు. వారందరికీ తెదేపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లి, నరసింగరాయునిపల్లి, చిన్నమొగలాయిపల్లి, న్యామద్దల గ్రామాల నుంచి 30 కుటుంబాలు పరిటాల సునీత సమక్షంలో చేరారు. కనగానపల్లి మండలం దాదులూరు, ఆత్మకూరు మండలం గొరిదిండ్ల, వి.డి.తాండ, సిద్ధరాంపురం, బి.యాలేరు, తలుపూరు గ్రామాల నుంచి 45 కుటుంబాలు పరిటాల శ్రీరామ్ సమక్షంలో పార్టీలో చేరగా, అనంతపురం గ్రామీణం సిండికేట్నగర్, కొడిమి గ్రామాల నుంచి 10 కుటుంబాలు పరిటాల సిద్ధార్థ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం సునీత మాట్లాడుతూ ఎన్నికల చివరి రోజు వరకు తెదేపాలోకి వలసలు ఆగడం లేదని, ఎవరైనా వైకాపా నాయకులు పార్టీలోకి రావాలంటే రావచ్చన్నారు. ఇక మీరు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, మీకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.
నీ ఈ ఐదేళ్లలో ఒక్క చెరువుకూ నీరు ఇవ్వకుండా జానెడు రోడ్డు వేయకుండా పాలన సాగించిన ప్రకాశ్రెడ్డిని వైకాపా నాయకులే చొక్కా పట్టుకుని నిలదీయాలని సునీత వ్యాఖ్యానించారు. ఆకుతోటపల్లి ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. మీ చెరువులకు నీరు ఇచ్చాడా, జానెడు రోడ్డు వేశాడా? మీరే ఆలోచించుకోవాలన్నారు. తెదేపా కార్యకర్తలు ఎవరూ ఆవేశాలకు లోను కావద్దని దృష్టి అంతా ఎన్నికలపైనే ఉండాలన్నారు. జూన్ 4న ఎవరు తొడలు కొడతారో ఎవరు మీసాలు తిప్పుతారో చూస్తారన్నారు. ఆకుతోటపల్లికి చెందిన వైకాపా నాయకులు మాజీ పంచాయతీ సర్పంచ్ బిరక పెదయ్య, చిదగొండ శేషు, మాజీ డీలర్ చిట్ర సంగయ్య, చిట్ర సూరి, అన్నగిరి ఈశ్వరయ్య, మలిశెట్టి ఈశ్వరయ్య, చిట్ర ఆదినారాయణ, వెన్నుపూస విజయ్కుమార్, స్థానిక గ్రామ నాయకుల ఆధ్వర్యంలో సునీత సమక్షంలో తెదేపాలోకి చేరారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిరప రైతుపై శీతకన్ను
[ 20-05-2024]
మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
కాలువల నిండా పూడిక.. సాగు సాగేదెలా ఏలిక?
[ 20-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. -
కష్టాలు కనవయ్యా.. వీరభద్రా!
[ 20-05-2024]
లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. -
పతకం కల.. దక్కించుకునే పట్టుదల
[ 20-05-2024]
ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్ టెన్నిస్ రాకెట్ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్ టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్లో అడుగుపెట్టాడు. గేమ్ మొత్తం లాన్ టెన్నిస్ మాదిరిగానే ఉంటుంది. -
నేటి నుంచి పెన్నహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 20-05-2024]
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
[ 20-05-2024]
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
సిట్ దర్యాప్తుపై తొలగని ఉత్కంఠ
[ 20-05-2024]
తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. -
ఎస్కేయూలో హాస్టళ్ల మూసివేతపై రగడ
[ 20-05-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో నాన్బోర్డర్ల బెడదతో వివాదం నెలకొంది. వేసవి సెలవుల్లో కూడా మహానంది వసతి గృహం తెరచి ఉంచాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. -
కొడవలితో వైకాపా కార్యకర్త వీరంగం
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు. -
జాతీయస్థాయిలో అనంతకు ఖ్యాతి
[ 20-05-2024]
మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
విద్యుదాఘాతానికి యువతి బలి
[ 20-05-2024]
విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్ చేయడానికి ప్రయత్నించింది. -
టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ
[ 20-05-2024]
ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
[ 20-05-2024]
ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్