గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ అమిత్ వెల్లడి
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలి’ అని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సహాయ కలెక్టర్ వినూత్న, డీఆర్ఓ రామకృష్ణారెడ్డి, ఎక్సైజ్ పర్యవేక్షకుడు మధుసూదన్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఈనెల 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, దీనికి ముందు 72 గంటలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ 72 గంటల్లో డబ్బు, మద్యం, ఇతరాత్ర ప్రలోభాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలను అప్రమత్తం చేశామని, రూ.50 వేలకు మించి రావాణా చేస్తే సీజ్ చేస్తామన్నారు.
నాలుగు రోజులు 144 సెక్షన్
11వ తేదీ నుంచి జిల్లాంతటా 144 సెక్షన్ను అమలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. పోలింగ్కు ముందు రెండు రోజులు, ఆ తర్వాత ఒక రోజు కీలకమని, నిర్దేశిత రోజుల్లో ఐదుగురికి మించి గుంపుగా ఉండకూడదన్నారు.. కేంద్ర బలగాలు జిల్లాకు వస్తున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు కోసం శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. వంద శాతం పీఎస్ల్లో వెబ్కాస్టింగ్ పెడుతున్నామని చెప్పారు.
రేపే ప్రచారానికి తుది గడువు
ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటలకే ఎన్నికల ప్రచారానికి తెర పడాలని కలెక్టర్ ఆదేశించారు. ర్యాలీలు, రోడ్షో, వాహనాల ద్వారా ప్రచారం.. ఇలా అన్నింటికి ముగింపు పలకాల్సిందేనన్నారు. ఆ తర్వాత ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయకూడదు. ఎన్నికల అధికారులు, సిబ్బంది మొబైళ్లు వాడకూడదన్నారు. ప్రతి నాలుగు పోలింగ్ కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. ఈవీఎంల మొరాయిస్తే సత్వరమే తగిన సౌకర్యాన్ని కల్పించడానికి ఈదపా ప్రతి నియోజకవర్గానికి పది మంది మాస్టర్ ట్రైనర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఎన్నికల్లో ఏ అక్రమం జరిగినా సి విజిల్ యాప్లో సత్వరమే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిరప రైతుపై శీతకన్ను
[ 20-05-2024]
మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
కాలువల నిండా పూడిక.. సాగు సాగేదెలా ఏలిక?
[ 20-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. -
కష్టాలు కనవయ్యా.. వీరభద్రా!
[ 20-05-2024]
లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. -
పతకం కల.. దక్కించుకునే పట్టుదల
[ 20-05-2024]
ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్ టెన్నిస్ రాకెట్ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్ టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్లో అడుగుపెట్టాడు. గేమ్ మొత్తం లాన్ టెన్నిస్ మాదిరిగానే ఉంటుంది. -
నేటి నుంచి పెన్నహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 20-05-2024]
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
[ 20-05-2024]
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
సిట్ దర్యాప్తుపై తొలగని ఉత్కంఠ
[ 20-05-2024]
తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. -
ఎస్కేయూలో హాస్టళ్ల మూసివేతపై రగడ
[ 20-05-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో నాన్బోర్డర్ల బెడదతో వివాదం నెలకొంది. వేసవి సెలవుల్లో కూడా మహానంది వసతి గృహం తెరచి ఉంచాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. -
కొడవలితో వైకాపా కార్యకర్త వీరంగం
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు. -
జాతీయస్థాయిలో అనంతకు ఖ్యాతి
[ 20-05-2024]
మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
విద్యుదాఘాతానికి యువతి బలి
[ 20-05-2024]
విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్ చేయడానికి ప్రయత్నించింది. -
టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ
[ 20-05-2024]
ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
[ 20-05-2024]
ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..