కరోనా పరీక్షలుచేయడం లేదంటూఆందోళన
మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో తెలిసిన వారికే గోప్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ మద్దతు తెలిపారు. ఒకసారి కిట్లు లేవని, మ
జిల్లా ఆసుపత్రి వద్ద బాధితుల నిరసన
మదనపల్లె గ్రామీణ, న్యూస్టుడే: మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో తెలిసిన వారికే గోప్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ మద్దతు తెలిపారు. ఒకసారి కిట్లు లేవని, మరోసారి ఓపీ పేరుతో కాలయాపన చేస్తూ.. రెండు రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిప్పుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు, ఆసుపత్రి వైద్యాధికారులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై సూపరింటెండెంట్ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఓపీలో పరీక్షించి అవసరమైన వారికి మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు కొవిడ్ పరీక్షలు చేస్తామన్నారు.
రుయాలో రోజుకు 60 మందికే..
తిరుపతి వైద్యవిభాగం: రుయాలో కిట్ల కొరతతో కొవిడ్ పరీక్షల కోసం బాధితులు నిరీక్షించాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం మొదట వచ్చిన 60 మందికే టోకెన్లు జారీ చేసి కొంతమంది నుంచే శ్వాబ్ సేకరించారు. మిగిలిన వారికి కిట్లు వచ్చాక శ్వాబ్ సేకరిస్తామని చెప్పడంతో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా పరీక్షలు చేయకపోవడంతో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న కొవిడ్ పరీక్ష కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ రోజా రమణి అక్కడి వచ్చి ప్రజలను సముదాయించారు. వేచి ఉన్న వారి నుంచి శ్వాబ్ సేకరించారు.
రుయా కొవిడ్ పరీక్ష కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న బాధితులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న జమానా.. పన్నులతో హైరానా
[ 10-05-2024]
పుత్తూరు పట్టణానికి చెందిన వీరయ్యకు గతంలో రూ.2,500 ఇంటి పన్ను చెల్లించేవాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధించడంతో రూ.4,500 చెల్లించాలని పురపాలక సంఘ అధికారులు అతడికి డిమాండ్ నోటీసు అందించారు. -
ఓటర్లకు డబ్బుతో వైకాపా గాలం..!
[ 10-05-2024]
ఐదేళ్లుగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న వైకాపా.. ఎన్నికల్లో విజయం సాధించాలని డబ్బుతో ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది. -
పోలింగ్ కేంద్రాల్ని అప్పగించాలి
[ 10-05-2024]
పోలింగ్ కేంద్రాల్ని శుక్రవారం నాటికి సెక్టోరియల్ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. ఎంఈవోలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. -
నమ్మించడం.. వంచించడం.. ఇదే జగన్ నైజం
[ 10-05-2024]
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు. -
తెదేపా ఆకలి తీర్చింది.. వైకాపా మూసేసింది
[ 10-05-2024]
రూ.2కే పేదలకు కిలో బియ్యం అందించిన తేదేపా ప్రభుత్వం వారి ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. -
జెండాలు వేరైనా.. అజెండా ఒకటే...!
[ 10-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటే అని నందమూరి రామక్రిష్ణ అన్నారు. మండలంలోని అరగొండ గ్రామంలో వైకాపాకు చెందిన రంజిత్కుమార్రెడ్డి, విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులకు ఆయన గురువారం తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
దేశానికి మోదీ.. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ అన్నారు. -
ప్రజలు ఎలాపోతే మనకేంటి..?
[ 10-05-2024]
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది.. -
జగన్.. పన్నుతో వేధించెన్
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూలధన విలువ ఆధారిత(సీవీ) ఆస్తిపన్ను విధింపుతో పట్టణ ప్రాంత భవనాలు, ఇళ్ల యజమానులపై మోయలేని భారం పడింది. -
సూపర్-6తోనే సామాజిక న్యాయం..!
[ 10-05-2024]
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్-6 పేరుతో చంద్రబాబు ప్రజల ముందుకు రాగా.. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రతిపాదించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. -
రెచ్చగొట్టి దాడిచేశారు
[ 10-05-2024]
రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఏర్పేడు మండలం దుర్గిపేరిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఎన్నికల రోజు కార్మికులకు సెలవు
[ 10-05-2024]
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్ యం.బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఓటు వేయడానికి మూడు గంటలు వేచి చూడాలా ?
[ 10-05-2024]
‘మేడమ్.. నేను వచ్చి సుమారు మూడు గంటల సేపవుతోంది. ఎన్నికల విధుల నుంచి ఇచ్చిన ఆర్డరు చూపించా. నా ఓటు చిత్తూరులో ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం