విద్యుత్తు సిబ్బంది ఏరీ.. ఎక్కడా..!
చిత్తూరు నగరం ఎల్బీపురంలో ఈ నెల 23న పెనుగాలుల వర్షానికి రెండు విద్యుత్తు స్తంభాలు పడిపోగా.. లైన్లు తెగిపోయాయి. నాలుగు రోజులు గడిచినా ఎవరూ పట్టించుకోలేదు.
గ్రామాల్లో సేవలు కరవు
వినియోగదారులకు తప్పని తిప్పలు
న్యూస్టుడే, చిత్తూరు(మిట్టూరు)
చిత్తూరు నగరం ఎల్బీపురంలో ఈ నెల 23న పెనుగాలుల వర్షానికి రెండు విద్యుత్తు స్తంభాలు పడిపోగా.. లైన్లు తెగిపోయాయి. నాలుగు రోజులు గడిచినా ఎవరూ పట్టించుకోలేదు. స్తంభం కూలిన ప్రాంతంలోనే పాఠశాల, శ్రీరాములవారి గుడి ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు విద్యుత్తు శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ‘సిబ్బంది లేరు.. ట్రాక్టర్, రిగ్ యంత్రం సమకూర్చుకోవాలని’ వారిచ్చిన సమాధానం. ఎట్టకేలకు సోమవారం(27న) మరమ్మతులు చేపట్టి పూర్తిచేశారు. ఇలా విద్యుత్తు సేవలందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన విద్యుత్తు అధికారులు, సిబ్బంది పోస్టులు గత కొన్నేళ్లుగా భర్తీ కావడం లేదు.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కరవయ్యారు.. లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉండటం.. మరోవైపు విధుల్లో ఉన్నవారు అప్పుడప్పుడైనా తనిఖీ చేయకపోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది.. స్థానికులే కొద్దిపాటి అవగాహనతో ఎలక్ట్రీషియన్గా మారి విద్యుత్తు పరివర్తకా వద్ద ఫ్యూజు వేయడం తదితర పనులు చేస్తున్నారు.. ఇదీ విద్యుత్తు శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్లో నెలకొన్న పరిస్థితి.
నిబంధనలు ఇలా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైన్మెన్ మాత్రమే స్తంభం ఎక్కాలి. జూనియర్ లైన్మెన్, సహాయ లైన్మెన్ అనుసంధానంగా ఉంటారు. 2001లో డిస్కంల ఆవిర్భావం తర్వాత నిబంధనలు సడలించారు. తద్వారా సహాయ లైన్మెన్ కూడా స్తంభం ఎక్కేలా సవరించారు. సచివాలయాల ఎనర్జీ అసిస్టెంట్(జేఎల్ఎం-గ్రేడ్ 2) పోస్టులు మినహా 2014 నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగలేదు. మార్గదర్శకాల ప్రకారం ఎనర్జీ అసిస్టెంట్ స్తంభం ఎక్కడానికి లేదు. అత్యవసర సమయంలో వారితో పనిచేయించినా, ఆ సమయంలో ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు అందుకు బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని జూనియర్ లైన్మెన్, సహాయ లైన్మెన్కు రెండు లేదా మూడు గ్రామాల చొప్పున విద్యుత్తు సరఫరా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
జేఎల్ఎం పోస్టులన్నీ ఖాళీయే..
చిత్తూరు అర్బన్ డివిజన్లో 12 సెక్షన్లు ఉన్నాయి. డివిజన్ పరిధిలో అన్ని విభాగాల సర్వీసులు సుమారు 1.75లక్షలు ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది పోస్టులు భర్తీకి నోచుకోలేదు. డివిజన్లో 63 జెఎల్ఎం పోస్టులు ఉండగా అవన్నీ ఖాళీయే. ఇక 90 ఏఎల్ఎం పోస్టులకు 21 పోస్టులు భర్తీ కాలేదు. 12 ఏఈ పోస్టులు ఉండగా ఆరుగురే పనిచేస్తున్నారు. గిరింపేట, రెడ్డిగుంట, కొత్తపల్లె, పెనుమూరు, చిత్తూరు రూరల్-3, ఆవలకొండలలో ఇన్ఛార్జి ఏఈలు కొనసాగుతున్నారు.
ప్రైవేటు సిబ్బందితో సేవలు..
క్షేత్రస్థాయి సిబ్బంది కొరతతో అధికారులు ప్రైవేటు సిబ్బందితో విద్యుత్తు స్తంభాలు, లైన్ల మార్పులు తదితర పనులు చేయిస్తున్నారు. ప్రధానంగా రెడ్డిగుంట, అనుప్పల్లి సెక్షన్లలో ప్రైవేటు సిబ్బందే గతి. వారిద్వారానే అన్ని సేవలందిస్తూ వారికి వినియోగదారుల నుంచి నగదు వసూలు చేసి అందజేస్తు న్నారు. పైసలు ముట్టచెబితేనే సేవలందుతాయి. లేనిపక్షంలో ఎన్నిరోజులైనా పట్టించుకునే వారు ఉండరు.
అంతరాయం లేకుండా చర్యలు
పద్మనాభపిళ్లై, ఇన్ఛార్జి ఈఈ, అర్బన్ డివిజన్, చిత్తూరు
వినియోగదారులకు అంతరాయం లేకుండా సేవలందిస్తున్నాం. సరఫరాలో ఏదైనా సమస్య వస్తే తక్షణమే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. జేఎల్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యుత్తు సేవలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్