logo

Chandrababu: నాగరికతను గుర్తు పెట్టుకొని భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలి: చంద్రబాబు

నాగరికతను గుర్తు పెట్టుకొని భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కుప్పంలో మూడో రోజు ఆయన పర్యటించారు.

Published : 30 Dec 2023 14:52 IST

కుప్పం: నాగరికతను గుర్తు పెట్టుకొని భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కుప్పంలో మూడో రోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కురబ వర్గంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఐటీలో కురబ కులస్థులు చాలా మంది స్థిరపడ్డారు. కురబ కులస్థులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తాం. మనం ఎప్పుడూ నాగరికతను మరిచిపోకూడదు. వైకాపా నాయకులు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని