పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది.
సమాచారం ఇచ్చే ఉద్యోగులేరీ..?
సూళ్లూరుపేట, న్యూస్టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 లాంటి ప్రయోగాలు చేపట్టి అందరి మన్ననలు పొంది, గగన్యాన్కు సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఇస్రోకు సంబంధించి వివిధ చోట్ల 19 కేంద్రాలు ఉన్నా కీలకమైనది సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్. వివిధ కేంద్రాల్లో రూపకల్పన చేసిన వాటిని తీసుకొచ్చి రాకెట్గా అనుసంధానం చేసి, నింగిలోకి అవలీలగా పంపుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత గల షార్లో పబ్లిసిటీ అండ్ పబ్లికేషన్ విభాగం నిర్వీర్యమైంది. రాకెట్ ప్రయోగాలకు మీడియా వారికి ఆహ్వానం తప్ప, మరే ఇతర సమాచారం ఇవ్వడం లేదు.
కేరళ రాజధాని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మొదటగా పబ్లిసిటీ అండ్ పబ్లికేషన్ విభాగం(పీఅండ్పీవో) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఎల్పీఎస్సీలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. 1987లో అప్పటి షార్ సంచాలకులు ఎంఆర్ కురూప్ శ్రీహరికోటలో ఈ విభాగాన్ని ప్రారంభించి పర్యవేక్షణ బాధ్యతలను ఓ అధికారికి అప్పగించారు. అప్పటి నుంచి రెండున్నరేళ్లు అవసరమైన సమాచారం, సందర్శకులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత షార్తో పాటు ఇస్రోకు సంబంధించిన ఎలాంటి సమాచారం చెప్పే వారే కరవయ్యారు. ఎవరిని అడిగినా తమకు ఏమీ తెలియదని, ఎంఎస్జీ, పీపీజీ విభాగాన్ని సంప్రదించాలని చెబుతున్నా, వారు కూడ సరైన సమాధానం ఇవ్వడంలేదు.
దేశ, విదేశీ సమాచారం
షార్కు చెందిన పీఅండ్పీవో విభాగం స్థానికంగా జరిగే ఏ విషయాలు తెలుపకపోగా, దేశ, విదేశాల్లో జరుగుతున్న విషయాలను మాత్రం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. స్థానిక సమాచారం లేకుండా, ఇతర ప్రాంతాల విషయాలు ఎందుకని మీడియా ప్రతినిధులు, ఇతరులు సైతం ప్రశ్నిస్తున్నారు. షార్లోని పీఅండ్పీవో విభాగంపై బెంగళూరులోని కేంద్ర కార్యాలయం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది
[ 28-04-2024]
వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. -
ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్దే..!
[ 28-04-2024]
రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
కుప్పంలో వైకాపా హైడ్రామా..?
[ 28-04-2024]
వైకాపా అడుగడుగునా కోడ్ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా. -
భృతిలేక.. పీఆర్సీ అమలుకాక
[ 28-04-2024]
‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. -
భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు
[ 28-04-2024]
వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. -
‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’
[ 28-04-2024]
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
[ 28-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. -
‘హమీ’తుమీ తేల్చవేం జగన్
[ 28-04-2024]
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. -
సీఎం వస్తున్నారని హడావుడి పనులు
[ 28-04-2024]
త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు